హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లు మరోసారి సత్తా చాటారు. ఈ జోడీ మరోసారి సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా తమ రికార్డుని మెరుగు పరచుకున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఓపెనర్లు ధావన్, రోహిత్ శర్మ నాలుగో సారి సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. టోర్నీలో భాగంగా గత ఆదివారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 136 పరుగులు సాధించి చాంపియన్స్ ట్రోఫీలో మూడుసార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడిగా రికార్డు సృష్టించింది. తాజాగా శ్రీలంక మ్యాచ్లో సైతం సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించడంతో ఈ జోడీ ఈ ఘనతను నాలుగోసారి తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ (78) అర్ధ సెంచరీని సాధించాడు.
సిక్సర్తో రోహిత్ శర్మ అర్ధ సెంచరీ మార్కును చేరుకోవడం విశేషం. అంతకుముందు పాకిస్తాన్తో మ్యాచ్లో కూడా సిక్సర్తోనే రోహిత్ శర్మ అర్థ సెంచరీ సాధించాడు. కాగా జట్టు స్కోరు 138 పరుగుల వద్ద రోహిత్ శర్మ తొలి వికెట్గా పెవిలియన్కు చేరాడు. దీంతో ఈ జోడి 138 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది.
ఇదే చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగుల భాగస్వామ్యం. ఇదిలా ఉంచితే, రోహిత్-ధావన్ల జోడి మరో ఘనతను కూడా సొంతం చేసుకుంది. వరుసగా వన్డేల్లో భారత తరపున మూడుసార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన తొలి జోడిగా సరికొత్త రికార్డు సృష్టించింది.
శ్రీలంకతో మ్యాచ్: కోహ్లీ డకౌట్, బౌండరీతో ధావన్ సెంచరీ