లండన్ : ఆయా దేశాల క్రికెటర్లు తమ అభిమాన క్రికెటర్లతో కూడిన క్రికెట్ ఎలివన్ జట్లను ప్రకటించడం ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోంది. గతేడాది అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కి గుడ్ బై చెప్పిన న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్ కూడా తాజాగా తన ఆల్ టైమ్ ఫేవరెట్ క్రికెట్ ఎలివన్ జట్టును ప్రకటించాడు.
అయితే ఈ జాబితాలో ఇండియా నుంచి చోటు దక్కించుకున్నది ఒక్క మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కరే కావడం గమనార్హం. ఆస్ట్రేలియా నుంచి నలుగురు ఆటగాళ్లు.. రికీ పాంటింగ్, ఆడమ్ గిల్ క్రిస్ట్, షేన్ వార్న్, మిచెల్ జాన్సన్ లు జాబితాలో చోటు దక్కించుకున్నారు. వెస్టిండీస్ నుంచి వివి రిచర్డ్స్, బ్రియాన్ లారా, క్రిస్ గేల్ కు స్థానం కల్పించాడు మెక్ కల్లమ్.
ఇకపోతే తన సొంత జట్టు న్యూజిలాండ్ నుంచి బౌలర్లు టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ కు స్థానం దక్కింది. అలాగే దక్షిణాఫ్రికా నుంచి జాక్వెస్ కల్లిస్ ఒక్కడినే జాబితాలో చేర్చిన మెక్ కల్లమ్.. ఓపెనర్లుగా క్రిస్ గేల్ సచిన్ లను ఎంచుకున్నాడు.
మూడో స్థానంలో రికీ పాంటింగ్, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా లారా, రిచర్డ్స్, ని ఎంపిక చేయగా తనకు ఆరో స్థానాన్ని కట్టబెట్టుకున్నాడు మెక్ కల్లమ్. ఇక ఏడో స్థానంలో ఆడమ్ గిల్ క్రిస్ట్ కి స్థానం కల్పించాడు.