హైదరాబాద్: 1993 హీరో కప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్స్లో టీమిండియా విజయం సాధించడానికి ముంగిస సాయం చేసిందని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు.
20కి పైగా ఆరుసార్లు: ఇంగ్లాండ్పై కోహ్లీ చెత్త రికార్డు
ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం కోల్కతాకు వచ్చిన సచిన్ మీడియాతో మాట్లాడుతూ ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఆ మ్యాచ్లో చివరి ఓవర్లో ఆరు పరుగులు చేయాల్సిన దక్షిణాఫ్రికా జట్టు భారత్ చేతిలో ఏవిధంగా ఓటమి పాలైందో సచిన్ తాజాగా గుర్తు చేసుకున్నాడు.
'1993లో దక్షిణాఫ్రికాతో ఈడెన్లో జరిగిన హీరో కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఎంత మందికి గుర్తు ఉందో నాకు తెలియదు. అది మొట్టమొదటి డే అండ్ నైట్ మ్యాచ్. ఆ మ్యాచ్ రెండో అర్థ భాగంలో మాకు ముంగిస కనిపించింది' అని ఐడీబీఐ ఫెడరల్ లైప్ ఇన్సూరెన్స్ కోల్ కతా పుల్ మారథన్లో ఈవెంట్లో సచిన్ పేర్కొన్నాడు.
'ఆ మ్యాచ్లో ముంగిస శకునం మాకు బాగా కలిసొచ్చింది. మా గెలుపులో ముంగిస సాయం కూడా ఉంది. మాకు వికెట్లు కావాల్సిన ప్రతీసారి ముంగిస కోసం ఎదురు చూశాం' అని అప్పటి జ్ఞాపకాల్ని సచిన్ టెండూల్కర్ నెమరవేసుకున్నాడు.
రెండో టీ20: టీమిండియా నమోదు చేసిన రికార్డులివే
ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో విఫలమైన సచిన్, బౌలింగ్లో రాణంచి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ అజహరుద్దీన్ ఇచ్చిన బంతితో చివరి ఓవర్ వేసిన సచిన్ మూడు డాట్ బాల్స్ సంధించాడు. చివరి బంతికి ఆరు పరుగులు చేయాల్సి వచ్చిన తరుణంలో బ్రియాన్ మెక్మిలన్ ఆ పరుగులను రాబట్టలేకపోయాడు.