హైదరాబాద్: మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంకలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముగిసిన మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఐదు వన్డేల సిరిస్లో భాగంగా తొలి వన్డే దంబుల్లా వేదికగా ఆదివారం ప్రారంభమైంది.
తొలి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇదిలా ఉంటే తొలి వన్డేకి ముందు టీమిండియా బస చేసిన అలియా రిసార్ట్ అండ్ స్పాలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు కలిసి చెట్టు నాటారు. వీటికి సంబంధించిన పోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వీరిద్దరూ కలిసి చెట్టుని నాటుతుండగా తీసిన ఫోటోలు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ క్లబ్ సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే షారుక్ ఖాన్ హీరోగా, అనుష్క హీరోయిన్గా నటించిన 'జబ్ హ్యారీ మెట్ సెజల్' ఇటీవల విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
సినిమా విడుదల అనంతరం అనుష్క... శ్రీలంక పర్యటనలో ఉన్న కోహ్లీ వద్దకు చేరుకుంది. ఇక, ఆతిథ్య శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ను భారత్ 3-0తేడాతో క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. టెస్టు సిరిస్ అనంతరం ఇరు జట్ల మధ్య ఐదు వన్డేల సిరిస్ మొదలైంది.
A post shared by Virat Kohli™ (@viratkohli__18_) on