హైదరాబాద్: సోషల్ మీడియాలో నిత్యం అభిమానులతో టచ్లో ఉండే టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తాజాగా ఓ వీడియోని అభిమానులతో పంచుకున్నాడు. వీడియోలో శిఖర్ ధావన్... ఆల్ రౌండర్ పాండ్యాతో కలిసి శ్రీలంక వీధుల్లో రాత్రి సమయంలో ఆటో నడిపాడు.
డ్రైవర్ స్థానంలో కూర్చుని ధావన్ ఆటో ఆటో నడుపుతుండగా పాండ్యా వెనుక సీటులో కూర్చున్నాడు. పాండ్య తన సెల్ఫోన్తో ధావన్ ఆటో నడుపుతున్న తీరుని వీడియో రూపంలో చిత్రీకరించాడు. అనంతరం ఈ వీడియోని ధావన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
Daddy D di Auto Rickshaw Ride @hardikpandya93 🤣🤣🤣🤣👌👌👌😉😉
A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on
'డాడీ ఆటో రిక్షా రైడ్' అని ధావన్ పేర్కొన్నాడు. భారత ఆటగాళ్లు ధావన్ను ముద్దుగా డాడీ అని పిలిచే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐదు వన్డేలు, ఏకైక టీ20 కోసం కోహ్లీసేన శ్రీలంకలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య తొలి వన్డే ఈ నెల 20న జరగనుంది.
ఇప్పటికే ఆతిథ్య శ్రీలంకతో మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ని 3-0తో టీమిండియా క్లీవ్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. టెస్టు సిరిస్ అనంతరం వన్డే సిరిస్ ప్రారంభానికి ముందు కాస్తంత విరామం లభించడంతో భారత ఆటగాళ్లు శ్రీలంకలోని దర్శనీయ ప్రదేశాల్లో సందడి చేస్తున్నారు.