మూడో క్రికెటర్గా ధావన్
కేవలం 168 బంతుల్లో 190 పరుగులు చేసిన ధావన్ తొలి రోజు లంచ్ నుంచి టీ విరామ సమయానికి 126 పరుగులు చేశాడు. దీంతో లంచ్ బ్రేక్ నుంచి టీ బ్రేక్ మధ్య రెండు సెంచరీలు చేసిన మూడో క్రికెటర్గా రికార్డు సాధించాడు. గతంలో బ్రాడ్మన్, సెహ్వాగ్లు మాత్రమే ఈ అరుదైన ఫీట్ను అందుకున్నారు.
ఆసీస్పై ధావన్ తొలి సెంచరీ
2012-13లో ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగన టెస్టు మ్యాచ్లో ధావన్ తొలి సెంచరీ నమోదు చేశాడు. ఆ మ్యాచ్లో లంచ్, టీ బ్రేక్ల మధ్య 106 పరుగులు చేశాడు. ఆ తర్వాత బుధవారం శ్రీలంకతో గాలే వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో సెంచరీ చేశాడు.
ఒక సెషల్లో బ్రాడ్మన్, సెహ్వాగ్లు సెంచరీలు
ఇలా క్రికెట్ దిగ్గజం బ్రాడ్మన్ 1930, 1934లలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో సెషన్లో 115, 107 పరుగులు చేశాడు. అతని తర్వాత సెహ్వాగ్ 2005లో పాకిస్థాన్పై ఒక సెషన్లో 109 పరుగులు చేయగా, 2007లో దక్షిణాఫ్రికాపై ఒక సెషన్లో 108 పరుగులు చేశాడు.
|
ధావన్ మాత్రం విఫలం
ఇలా ఒక సెషన్లో వందకు పైగా పరుగులు చేసిన సందర్భాల్లో బ్రాడ్మన్, సెహ్వాగ్ డబుల్, ట్రిపుల్ సెంచరీలు చేయగా శిఖర్ ధావన్ మాత్రం విఫలమయ్యాడు.