హైదరాబాద్: కోల్కతా వేదికగా ఇంగ్లాండ్తో జరగనున్న మూడో వన్డేకు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అందుబాటులో ఉండడం అనుమానంగా ఉంది. గతేడాది అక్టోబర్లో న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ సందర్భంగా ధవన్కు కుడి చేతి బొటన వేలికి గాయమైంది.
శుక్రవారం జట్టుతో పాటు కోల్కతాకు చేరుకున్న ధావన్ను ఆ గాయం తిరగబెట్టింది. దీంతో కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. మూడు వన్డేల సిరిస్లో భాగంగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో ఒకే ఒక్క పరుగు చేసిన ధావన్, రెండో వన్డేలో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు.
దీంతో ఆదివారం దీంతో ఆదివారం జరగనున్న మూడో వన్డేలో అతడి స్థానంపై ఇప్పటికే అనుమానాలు నెలకొన్నాయి. కాగా, మూడో వన్డేలో ధావన్ స్థానంలో అజింక్యా రహానెను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మూడు వన్డేల సిరిస్లో భాగంగా ఇంకో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరిస్ను టీమిండియా కైవసం చేసుకుంది.