కోల్కతా: భారత్-న్యూజిలాండ్ మధ్య కోల్కతా రెండో టెస్టుకు ముందు పశ్చిమబెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి అనూహ్య సంఘటన ఎదురైంది. ఈడెన్ గార్డెన్స్లోని ఆఫీసు లిఫ్ట్లో గంగూలీ ఇరుక్కుపోయాడు.
తన ఆఫీసు గదికి వెళ్లడానికి అతను లిఫ్ట్ ఎక్కగా.. అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది విద్యుత్ సరఫరా ఆపేసి.. డోర్ని తెరిచారు. ఒక ఎత్తైన స్టూల్ ఎక్కి గంగూలీ లిఫ్ట్ నుంచి బయటపడ్డాడు. కాగా, లిఫ్ట్ కొంత పాతది కావడం వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.
వెంటనే విద్యుత్ సరఫరా ఆపేసి, గంగూలీని బయటికి తీసుకొచ్చామని సెక్యూరిటీ అధికారులు తెలిపారు.లిఫ్ట్ మార్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరాం, కానీ, అందుకు కొంత సమయం పడుతుందని వారు చెప్పారు.
కివీస్కు గంగూలీ చిట్కాలు
ఇది ఇలా ఉండగా, తొలి టెస్టులో స్పిన్ దెబ్బకు చేతులెత్తేసిన న్యూజిలాండ్.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీని ఆశ్రయించింది. గురువారం ఈడెన్ గార్డెన్స్లో క్యాబ్ అధ్యక్షుడు గంగూలీ నుంచి కొన్ని చిట్కాలు నేర్చుకుంది.
ఈడెన్ వికెట్పై ఎలా ఆడాలో గంగూలీ స్టాన్స్ తీసుకుని చూపిస్తుంటే.. కివీస్ కోచ్ మెక్మిలన్, మిగతా సహాయక సిబ్బంది శ్రద్ధగా విన్నారు. కాగా, శుక్రవారం కివీస్, టీమిండియా మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైంది.