న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టుకు కోచ్ కావాలని ఆశపడి, కేవలం బ్యాటింగ్ కోచ్ గా మాత్రమే సరిపెట్టుకున్న రవిశాస్త్రి.. టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ కోసం ఇంటర్వ్యూలు చేసిన కమిటీలో ఒకరైన సౌరవ్ గంగూలీపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను ఇంటర్వ్యూ చేసినప్పుడు గంగూలీ లేడని రవిశాస్త్రి వ్యాఖ్యానించగా, వీటిపై గంగూలీ స్పందించాడు.
ఇంటర్వ్యూ ప్రక్రియంతా రహస్యమని, రవిశాస్త్రి మాటలపై తానేమీ చెప్పబోనని అన్నాడు. రవిశాస్త్రి వ్యాఖ్యలపై తాను మాట్లాడదలచుకోలేదని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఆయన్ను ఇంటర్వ్యూ చేశారని తెలిపాడు.
ఆ సమయంలో తాను క్యాబ్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నానని చెప్పాడు. ఆ తర్వాత సచిన్, లక్ష్మణ్ ను కలిశానని తెలిపాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీలో సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, లక్ష్మణ్ సభ్యులుగా ఉన్నారు. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేను నియమించిన సంగతి తెలిసిందే.
కాగా, టీమిండియా చీఫ్ కోచ్ పదవి దక్కనందుకు మాజీ కెప్టెన్ రవిశాస్త్రి తీవ్ర నిరాశకు గురయ్యాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ తనను ఇంటర్వ్యూ చేసినపుడు కమిటీ సభ్యుడు సౌరభ్ గంగూలీ పాల్గొనలేదని రవిశాస్త్రి చెప్పాడు. థాయ్ లాండ్ నుంచి తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూకు హాజరయ్యానని తెలిపాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులు తనను మంచి ప్రశ్నలు అడిగారని చెప్పాడు.