నిబంధనలకు విరుద్ధమని వారించిన అంపైర్ నిగెల్ లాంగ్
ఈ సమయంలో అంపైర్ నిగెల్ లాంగ్ కల్పించుకొని అది నిబంధనలకు విరుద్ధమని వారించడంతో మైదానాన్ని వీడి స్మిత్ వెళ్లిపోయాడు. రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఆసీస్కు ఇంకా ఒక రివ్యూ మాత్రమే మిగిలి ఉంది. అందుకే స్మిత్ డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న సభ్యులకు సంకేతాలు పంపాడు.
దీనిని గమనించిన కోహ్లీ అంపైర్ను ఆశ్రయించాడు
వాళ్లు అవుట్ కాదని సూచిస్తే స్మిత్ రివ్యూని కోరదామని అనుకున్నాడు. అయితే దీనిని గమనించిన కోహ్లీ అంపైర్ను ఆశ్రయించాడు. మైదానంలో ఉన్న హ్యాండ్స్ కోంబ్ వద్దకు వెళ్లి స్మిత్ మాట్లాడుతుండగా అంపైర్ వారిని నిలువరించాడు. అదే సమయంలో ఆసీస్ ఆటగాళ్లకు దగ్గరగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వచ్చాడు.
స్మిత్ మైదానం వీడిన అనంతరం అంపైర్లతో కోహ్లీ మంతనాలు
దీంతో అప్రమత్తంగా వ్యవహరించిన అంపైర్ మరోసారి స్టీవ్ స్మిత్ను మైదానం వీడాల్సిందిగా సూచించాడు. స్మిత్ మైదానం వీడిన అనంతరం ఫీల్డ్ అంపైర్లు, కోహ్లీ జరిగిన దానిపై కాసేపు చర్చించారు. అనంతరం ఎవరి స్థానాలకు వాళ్లు వెళ్లిపోవడంతో ఆట తిరిగి ప్రారంభమైంది.
రివ్యూపై ఆస్ట్రేలియన్లు డ్రెసింగ్ రూమ్ వైపు సైగలు
ఈ వివాదంపై సునీల్ గవాస్కర్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ 'కామెంటరీ బాక్స్లో ఉన్న చాలామంది ఈ వివాదం గురించి స్పందించారు. డీఆర్ఎస్ రివ్యూ కోరాలా? వద్దా? అనే దానిపై ఆస్ట్రేలియన్లు డ్రెసింగ్ రూమ్ వైపు సైగలు చేస్తున్నారు. అక్కడ ఉన్న తమ కంప్యూటర్ నిపుణుడి సూచనలు తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు' అని అన్నాడు
ఇది చాలా దారుణమన్న గవాస్కర్
ఇది చాలా దారుణం. హ్యాండ్స్కోంబ్తో చర్చించిన తర్వాత కూడా స్మిత్ నిపుణుడి సైగల కోసం డ్రెసింగ్ రూమ్ వైపు చూశాడు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. దీనిపై ఐసీసీ, మ్యాచ్ రిఫరీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి' అని గవాస్కర్ పేర్కొన్నాడు.
స్మిత్ తీరును తప్పుబట్టిన మాజీలు
ఈ వివాదంపై మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, ఆకాశ్ చోప్రా సైతం స్మిత్ తీరును తప్పుబట్టారు. రివ్యూ తీసుకోవాలా? వద్దా? అనేదానిపై డ్రెసింగ్ రూమ్ నుంచి సైగలు ద్వారా సూచనలు తీసుకోవడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని లక్ష్మణ్ ట్వీట్ చేయగా, ఇది మోసం చేయడమేనని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.