హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు టీ20ల సిరిస్కు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లతిష్ మలింగ ఎంపికయ్యాడు. మోకాలి గాయం కారణంగా జట్టుకు మలింగ దూరమయ్యాడు. ఫిబ్రవరి 17 నుంచి ఇరు జట్ల మధ్య టీ20 సిరిస్ ప్రారంభం కానుంది.
ఆసియా కప్లో భాగంగా బంగ్లాదేశ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో జరిగిన మ్యాచ్లో చివరిసారిగా మలింగ్ ఆడాడు. రెగ్యులర్ కెప్టెన్ ఏంజెలో మ్యాథ్యూస్ గాయం కారణంగా జట్టుకు దూరమవ్వడంతో అతడి స్దానంలో ఉపుల్ తరంగా లంకకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
మూడు టీ20ల సిరిస్లో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్న శ్రీలంక ఫిబ్రవరి 17న తొలి టీ20 ఆడనుంది. ఆ తర్వాత గీలాంగ్, అడిలైడ్లో రెండు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. కాగా, శ్రీలంకతో జరగనున్న మూడు టీ20ల సిరీస్కు కెప్టెన్గా ఆరోన్ ఫించ్ సారథ్యం వహించనున్నాడు.
లంకతో టీ20 సిరిస్: ఆసీస్ జట్టు కెప్టెన్గా ఆరోన్ ఫించ్
రెగ్యులర్ కెప్టెన్ స్టీవ్ స్మిత్కు గాయం కావడంతో ఫించ్ను కెప్టెన్గా నియమిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. భారత పర్యటనను దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ డేవిడ్ వార్నర్లకు కూడా శ్రీలంకతో జరిగే సిరీస్లో విశ్రాంతినిచ్చారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఫిబ్రవరి 17నుంచి ఆసీస్, శ్రీలంక మధ్య తొలి టీ20 జరగనుంది.
శ్రీలక జట్టు: Upul Tharanga (captain), Niroshan Dickwella, Asela Gunarathna, Dilshan Munaweera, Kusal Mendis, Milinda Siriwardena, Sachith Pathirana, Chamara Kapugedara, Seekuge Prassanna, Nuwan Kulasekera, Isuru Udana, Dasun Chanaka, Lakshan Sandakan, Lasith Malinga, Vikum Sanjaya.