రెండు సార్లు 500 పరుగులు చేసిన గవాస్కర్
1978-79 సీజన్లో వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో గవాస్కర్ ఐదు వందలకు పైగా పరుగులు చేశాడు. ఆ తర్వాత 1981-82 సీజన్లో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో గవాస్కర్ ఐదు వందల పరుగుల మార్కును రెండోసారి సాధించి చరిత్ర సృష్టించాడు. తాజాగా ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరిస్లో కోహ్లీ ఈ ఫీట్ని సాధించాడు.
కోహ్లీ యావరేజి 120
ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ ఫీట్ను సాధించే క్రమంలో కోహ్లీ యావరేజి 120కి పైగా ఉండటమే. నాలుగో టెస్టులో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. కోహ్లీకి ఇది టెస్టుల్లో 15వ సెంచరీ కాగా, ఈ సిరీస్లో రెండోది. 187 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 11 ఫోర్ల సాయంతో సెంచరీని పూర్తి చేశాడు.
టెస్టుల్లో 15వది కాగా, కెప్టెన్గా 8వది
ఇదిలా ఉండే నాలుగో టెస్టులో కోహ్లీ చేసిన సెంచరీ టెస్టుల్లో 15వది కాగా, కెప్టెన్గా 8వది. ఈ నేపథ్యంలో కెప్టెన్గా అత్యధిక సెంచరీలు నమోదు చేసిన భారత కెప్టెన్లను పరిశీలిస్తే అందులో సునీల్ గవాస్కర్ 11 సెంచరీలతో మొదటిస్ధానంలో ఉన్నాడు.
కెప్టెన్గా అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన భారత కెప్టెన్లు వీరే
సునీల్ గవాస్కర్ - 11
మహ్మద్ అజారుద్దీన్ - 9
విరాట్ కోహ్లీ - 8
సచిన్ టెండూల్కర్ - 7
పటౌడీ,గంగూలి,ధోనీ - 5