మూడు రోజుల్లోనే ముగించిన ఆసీస్
ఐదు రోజులు జరిగాల్సిన ఈ టెస్టును ఆస్ట్రేలియన్లు కేవలం మూడు రోజుల్లోనే ముగించారు. స్పిన్నర్లు ఓకీఫ్, లియాన్లు రెండో ఇన్నింగ్స్లో భారత మొత్తం వికెట్లను తీశారు. ఓకీఫ్కు ఆరు వికెట్లు తీసుకోగా, లియాన్కు నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా ఈ టెస్టులో ఓకీఫ్ 12 వికెట్లు తీసుకోగా, లియాన్ ఐదు వికెట్లు తీశాడు.
టీమిండియా ఘోర ఓటమి
పూణె టెస్టులో టీమిండియా ఘోరంగా ఓటమి పాలైంది. భారత్పై ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 441 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 33.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. పూణె టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ ఓకీఫ్ 12 వికెట్లు తీసుకుని చరిత్ర సృష్టించాడు.
1-0తో ఆధిక్యంలో నిలిచిన ఆస్ట్రేలియా
దీంతో నాలుగు టెస్టుల సిరిస్లో 1-0తో ఆస్ట్రేలియా ఆధిక్యంలో నిలిచింది. భారత బ్యాట్స్మెన్లలో పుజారా చేసిన 31 పరుగులే అత్యధికం. ఇక మురళీ విజయ్ 2, రాహుల్ 10, కోహ్లీ 13, రహానే 18, అశ్విన్ 8, సాహా 5, యాదవ్ 5, జడేజా 3 పరుగులు చేశారు.
333 పరుగుల తేడాతో ఘన విజయం
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 260 పరుగులకే ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా 105 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఆసీస్కు 155 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్ విషయానికి వస్తే ఆసీస్ 285 పరుగులు చేయగా, భారత్ 107 పరుగులకే ఆలౌటైంది.