తొలి టెస్టులో నిరాశపరిచిన గంభీర్
రాజ్కోట్లో జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లో 29, 0 పరుగులే చేసి నిరాశపరిచాడు. దీంతో విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో గంభీర్ బెంచ్కే పరిమితమయ్యాడు. గంభీర్ స్ధానంలో బ్యాటింగ్కు దిగిన కేఎల్ రాహుల్ కూడా ఆశించిన మేరకు రాణించనప్పటికీ ఇటీవలి కాలంలో అతని ఫామ్ను దృష్టిలో పెట్టుకుని మిగిలిన సిరీస్లోనూ కొనసాగించాలని సెలక్టర్లు భావించారు.
భువీ ఇన్, గంభీర్ ఔట్
దీంతో గంభీర్పై వేటు వేసింది. ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో అద్భుతంగా రాణించిన భువనేశ్వర్ను గంభీర్ స్థానంలో జట్టులోకి తీసుకున్నారు. కోల్కతాలో జరిగిన రెండో టెస్టులో ఒక ఇన్నింగ్స్లో భువనేశ్వర్ ఐదు వికెట్లు తీసుకుని సత్తా చాటాడు. ఆ తర్వాత వెన్నెముక గాయం కావడంతో ఆరు వారాలపాటు ఆటకు దూరమయ్యాడు.
రంజీల్లో 36 ఓవర్లు వేసి ఫిట్నెస్
గాయం కారణంగా భారత జట్టులో చోటు కోల్పోయిన భువనేశ్వర్ ఉత్తర ప్రదేశ్ తరఫున ఆడి 36 ఓవర్లు బౌలింగ్ చేసి ఫిట్నెస్ నిరూపించుకొని జట్టులోకి తిరిగొచ్చాడు. దీంతో భారత జట్టులో భువనేశ్వర్ కుమార్ రీ ఎంట్రీకి లైన్ క్లియర్ అ యింది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా మూడో టెస్టు ఈ నెల 26 నుంచి మొహాలీలో జరగనుంది.
సిరిస్లో 1-0తో భారత్ ముందంజ
రాజ్ కోట్లో జరిగిన తొలి టెస్టును డ్రాగా ముగించిన టీమిండియా, ఆ తర్వాత విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించింది. దాంతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో 1-0తో భారత్ ముందంజలో ఉంది. ఇక భువనేశ్వర్ కుమార్ను తిరిగి జట్టులోకి తీసుకోవడం భారత్కు కలిసొచ్చే అంశమే.
మిగతా మూడు టెస్టులకు భారత జట్టు
భారత్ జట్టు : కోహ్లీ(కెప్టెన్), రహానే(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మురళీ విజయ్, ఛటేశ్వర పుజారా, కరుణ్ నాయర్, పార్ధీవ్ పటేల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, అమిత్ మిశ్రా, షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా