హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్' మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే భారత సాయుధ దళాల కోసం భారత వైమానిక దళ ఆడిటోరియంలో ఈ సినిమా ఫస్ట్ స్క్రీనింగ్ జరిగిన సంగతి తెలిసిందే.
ప్రత్యేక షో: సచిన్ సినిమా తొలుత చూసిందెవరో తెలుసా? (ఫోటోలు)
తాజాగా ఈ సినిమాని బుధవారం టీమిండియా ఆటగాళ్లు అందరూ కలిసి వీక్షించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత రవి భగచ్కంద వెల్లడించారు. టీమిండియా కోసం ముంబయైలోని వెర్సోవలో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే వారందరికీ ఆహ్వానాలు పంపించినట్లు ఆయన తెలిపారు.
ఈ సినిమా మే 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల సిద్ధమైంది. హాలివుడ్ దర్శకుడు జెమ్స్ ఎర్సకైన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సచిన్ టెండూల్కర్ జీవితంలో ఎవరికీ తెలియని విషయాలను చూపించారు. ఈ సినిమాకి సంగీతం ఏఆర్ రెహమాన్ అందించాడు.
ఇప్పటికే ఈ సినిమాకి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కేరళ రాష్ట్రాలు పన్ను మినహయింపు ఇచ్చాయి. గత శనివారం భారత సాయుధ బలగాల కోసం వైమానికదళ ఆడిటోరియంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఎయిర్ఫోర్స్ గ్రూప్ గౌరవ కెప్టెన్ సచిన్, ఆయన సతీమణి అంజలి, ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా, బలగాలు తమ కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు.
The CAS along with @sachin_rt at special screening of the biopic #SachinABillionDreams, for the #Airwarriors, @AirForceAuditorium, Today. pic.twitter.com/BOAokXvXbR
— Indian Air Force (@IAF_MCC) May 20, 2017
ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆడిటోరియం అంతా సచిన్ నామస్మరణతో మార్మోగిపోయింది. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఈ సినిమా వీక్షించిన తర్వాత సచిన్ టెండూల్కర్ ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా... సచిన్కు ఓ జ్ఞాపిక అందజేశారు.