హైదరాబాద్: ఉమెన్ వరల్డ్ కప్లో టీమిండియాను రన్నరప్గా నిలిపిన కెప్టెన్ మిథాలీ రాజ్కు బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందించనున్నట్లు మాజీ క్రికెటర్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ చైర్మన్ చాముండేశ్వరీనాథ్ ప్రకటించారు.
2007లో మిథాలీకి షెవర్లె కారును ఇచ్చిన చాముండి.. ఈసారి రూ.40లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారుని బహుమతిగా ఇస్తున్నట్లు చెప్పాడు. ఈ కారును సచిన్ చేతుల మీదుగా ఇప్పించే ఆలోచనలో ఉన్నట్టు ఆయన తెలిపారు. క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే తాను ఈ బహుమతిని ఇచ్చినట్టు అన్నారు.
కాగా, గతేడాది రియో ఒలింపిక్స్లో సత్తాచాటిన పీవీ సింధు, దీపా కర్మాంకర్, సాక్షి మాలిక్లకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదగా చాముండేశ్వరీనాథ్ బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.