హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీ పైనల్లో టీమిండియా.. బంగ్లాదేశ్తో తలపడుతుంటే ధోని కూతురు జివా మాత్రం తనలోని మ్యూజిక్ టాలెంట్ని బయట పెట్టింది. జివా పియానో ప్లే చేస్తున్నప్పుడు వీడియో తీసి తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో ధోనీ భార్య సాక్షి పోస్టు చేసింది.
వీటికి సంబంధించి జివా రెండు వీడియోలను పోస్టు చేసింది. తన చిట్టి చేతులతో ఎంతో ముద్దుగా పియనో ప్లే చేస్తున్న జివాను నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. జివా పియనో ప్లే చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా పాకిస్థాన్, దక్షిణాఫ్రికాలపై విజయం సాధించి గురువారం బంగ్లాదేశ్తో సెమీ పైనల్ మ్యాచ్లో కోహ్లీసేన తలపడింది. ఈ మ్యాచ్లో కోహ్లీ సేన విజయం సాధిస్తే ఫైనల్లో తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్తో తలపడుతుంది.
ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ధోని కేవలం ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్కు దిగాడు. టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 63 పరుగులతో రాణించాడు.