న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీ ఛాంపియన్ ప్లేయర్ కానీ సచిన్ ఎప్పటికీ నెంబర్ వన్'

కోహ్లీ ఒక గొప్ప ఛాంపియన్ ప్లేయర్ అని అయితే సచిన్ మాత్రం ఎప్పటికీ నెంబర్ వన్ ఆటగాడని హర్భజన్ సింగ్ అన్నాడు. తన బ్యాటింగ్‌తో క్రికెట్‌లో సరికొత్త స్టాండర్స్‌ను సచిన్ సృష్టించాడని కొనియాడాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: గత కొంతకాలంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్‌తో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డులను బ్రేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో కోహ్లీని సచిన్‌తో పోల్చి మాట్లాడటం సర్వసాధారణం అయింది. అయితే ఈ విషయంపై హర్భజన్ సింగ్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో స్పందించాడు.

కెప్టెన్ కోహ్లీ వన్డేల్లో సచిన్ టెండూల్కర్ రికార్డులను బ్రేక్ చేయొచ్చు కానీ టెస్టుల్లో మాత్రం సచిన్‌ను అధిగమించడం చాలా కష్టమని అన్నాడు. కోహ్లీ ఒక గొప్ప ఛాంపియన్ ప్లేయర్ అని అయితే సచిన్ మాత్రం ఎప్పటికీ నెంబర్ వన్ ఆటగాడని హర్భజన్ సింగ్ అన్నాడు.

Harbhajan Singh

తన బ్యాటింగ్‌తో క్రికెట్‌లో సరికొత్త స్టాండర్స్‌ను సచిన్ సృష్టించాడని కొనియాడాడు. 'సచిన్ బ్యాటింగ్ రికార్డులను కోహ్లీ బ్రేక్ చేయొచ్చు, కానీ సచిన్ మాత్రం ఎప్పటికీ సచిన్‌ అని' హర్భజన్ సింగ్ అన్నాడు. ఈ దేశంలో చాలా మంది ఆటగాళ్లు.. కోహ్లీ నాతో సహా ఈరోజు క్రికెట్ ఆడుతున్నామంటే అది సచిన్ వల్లేనని చెప్పుకొచ్చాడు.

ఇక గత కొంతకాలంగా అద్భుత ప్రదర్శన చేస్తున్న కోహ్లీపై కూడా భజ్జీ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్ పట్ల కోహ్లీకి ఉన్న ఫ్యాషన్ తదుపరి లెవెల్‌కు తీసుకెళ్తుందని చెప్పాడు. జట్టుని ఓ కుంటుబంలాగా కోహ్లీ నడిపిస్తున్న తీరు అమోఘమని హార్భజన్ సింగ్ చెప్పాడు.

తాను ఫిట్‌గా ఉంటూ ఇతరు క్రికెటర్లకు ప్రేరణ నిలవడం నిజంగా అద్భుతమని భజ్జీ అన్నాడు. ఇక నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టుపై హర్భజన్ సింగ్ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు.

ఆస్ట్రేలియా జట్టు తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడినా సరే భారత జట్టు 3-0 తేడాతో సిరీస్ గెలుస్తుందని అన్నాడు. ఒకవేళ సరిగా ఆడకపోతే మాత్రం కోహ్లీ సేన 4-0 తేడాతో ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేస్తుందని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఫిబ్రవరి 23 నుంచి పూణెలో జరగనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X