హైదరాబాద్: టీమిండియాలో బెస్ట్ డ్యాన్సర్ విరాట్ కోహ్లీయే అంటూ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. బుధవారం ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో సియట్ క్రికెట్ రేటింగ్ ఇంటర్నేషనల్ అవార్డులు-2017 కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 2016-17 సంవత్సరానికి గాను 'అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుని అందుకున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రశ్నకు అశ్విన్ సమాధానం చెబుతూ భారత క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా మంచి గాయకులు, డ్యాన్సర్లు అని అన్నాడు.
కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు ఇంగ్లాండ్కు చేరుకుంది. జూన్ 1 నుంచి 18 వరకు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుంది. మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ట్రోఫీ కోసం తలపడుతున్నాయి.