ముంబై:టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి , ఆల్ రౌండర్ రవిచంద్రన్ ఆశ్విన్ అరుదైన ఘనతను స్వంతం చేసుకొన్నారు. 2015-16 సీజన్ కు గాను భారత క్రికెట్ బోర్డు(బిసీసీఐ) ప్రకటించిన అవార్డుల్లో పాలీ ఉమ్రిగర్ అవార్డును కోహ్లీ, దిలీప్ వెంగ్సర్కార్ అవార్డును ఆశ్విన్ దక్కించుకొన్నారు.
2011-12,2014-15 సీజన్లలో ఈ అవార్డును కోహ్లీని వరించింది. ఈ నెల 8వ, తేదిన బెంగుళూరులో జరిగే అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. మరో వైపు ఆశ్విన్ రికార్డు స్థాయిలో రెండో సారి దిలీప్ వెంగ్సర్కార్ అవార్డుకు ఎంపికయ్యారు.
2011-12 సీజన్ లో తొలిసారి ఆశ్విన్ కు ఈ అవార్డు దక్కింది. ఏ భారత భౌలర్ కూడ రెండో దఫా ఈ అవార్డుకు ఎంపిక కాలేదు. 2015-16 సీజన్ లో ఆశ్విన్ అత్యుత్తమంగా రాణించాడు.
సీకెనాయుడు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును రాజేందర్ గోయల్ , పద్మాకర్ శివాల్కర్ , మహిళల విభాగంలో ఈ అవార్డును శాంతా రంగస్వామి స్వంతం చేసుకొన్నారు. బీసీసీఐ స్పెషల్ అవార్డు వీవీకుమార్ , రమాకాంత్ దేవాయ్ ఎంపికయ్యారు.