కింగ్ స్టన్ : మొదటి టెస్టు విజయంతో టీమ్ ఇండియా రెండో టెస్టు కోసం కసరత్తులు మొదలుపెట్టింది. బుధవారం ఉదయం సబీనా పార్క్ లో టీమ్ ఇండియా క్రికెటర్స్ నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కింగ్ స్టన్ లో అడుగుపెట్టిన కొద్ది గంటల్లోనే మైదానానికి చేరుకున్న టీమ్ ఇండియా బాగానే చెమటోడ్చింది.
పలు రకాల వ్యాయామాలతో పాటు బ్యాటింగ్ బౌలింగ్ కు సంబంధించి విభిన్న తరహాలో ప్రాక్టీస్ చేశారు టీమ్ ఇండియా క్రికెటర్స్. ముఖ్యంగా కీపర్ వృద్దిమాన్ సాహా కీపింగ్ కు సంబంధించిన మెలుకువలపై ఫోకస్ పెట్టగా.. మొదటి టెస్టులో బొటనవేలి గాయమైన ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ విజయ్ తేలికపాటి కసరత్తులు చేశాడు.
ఇక మరో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా నెట్ ప్రాక్టీస్ లో చాలా బంతులను ఎదుర్కొన్నాడు. బ్యాటింగ్ తో పాటు బంతిని బలంగా విసరడంలో ఫీల్డింగ్ కసరత్తులు కూడా చేశాడు ధావన్.
{photo-feature}