బెంగళూరు: భారత పరుగుల యంత్రం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా పెయింటర్ అవతారం ఎత్తాడు. మైదానంలో మెరుపులు మెరిపించడమే కాదు.. తనకు పెయింటింగ్ వేయడం కూడా వచ్చు అని నిరూపించుకున్నాడు కోహ్లీ.
అంతేగాక, పెయింటింగ్ పోటీలో పాల్గొని గెలుపొందాడు కూడా. బెంగళూరు తరపున ఆడే ఆటగాళ్లను ఎప్పుడూ ఏదో ఒక ఇంటర్వ్యూ చేసే నేగ్స్.. తాజాగా కోహ్లీని ఇంటర్వ్యూ చేశాడు.
నేగ్స్ అడిగిన సరదా ప్రశ్నలకు కోహ్లీ సమాధానం చెప్పాడు. తమ జట్టు ప్లేఆఫ్కు వెళ్లేందుకు ఏబి డివిలియర్స్ కీలకంగా వ్యవహరించాడని చెప్పాడు. తన ఫిట్నెస్ కోచ్ శంకర్ బసు కూడా తన ఫాంకు కారణమని తెలిపాడు.
అంతేగాక, తనకు పెయింటింగ్ అంటే ఇష్టమని కూడా తెలిపాడు. దీంతో తనతో పెయింటింగ్ వేసి గెలవమని నేగ్స్ కోరడంతో కోహ్లీ స్వయంగా బొమ్మను గీసి నేగ్స్ని ఓడించాడు. కాగా, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
కాగా, ఓ కళాకారుడు కోహ్లీ చిత్రాన్ని అద్బుతంగా చిత్రకరించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. 'వావ్' అంటూ అతన్ని మెచ్చుకుంటూ విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఆ తర్వాత నేగ్స్కి కూడా పెయింటింగ్ వేసి పంపిస్తాడు.