న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ సిఫారసు: కోహ్లీకి ఖేల్‌రత్న, రహానేకి అర్జున..!

By Nageswara Rao

న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని దేశంలో క్రీడా అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న వరించనుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కేంద్రానికి విరాట్ కోహ్లీ పేరుని సిఫారసు చేసింది. బీసీసీఐ నుంచి ఈ మేరకు లేఖ అందినట్లు స్పోర్స్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి వెల్లడించారు.

కాగా, టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ అజ్యింకె రహానేను అర్జున అవార్డుకు బీసీసీఐ సిఫారసు చేసింది. టీమిండియాలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ 2014-15లో టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా కోహ్లీ నియమితుడయ్యాడు.

శ్రీలకంతో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియాను నాయకత్వ బాధత్యతో విజయ పథంలో నడిపించాడు. ఇటీవల ఐపీఎల్-9లోనూ సెంచరీతో చెలరేగాడు.

అప్పటి నుంచి భారత జట్టుకు అధ్బుతమైన విజయాలను అందిస్తూనే ఉన్నాడు. భారత జట్టులో నెంబర్ 3 ఆటగాడిగా రాణిస్తున్న విరాట్ కోహ్లీ అనతి కాలంలోనే జట్టులో అద్భుతమైన ఆటగాడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు.

Virat Kohli nominated for Rajiv Gandhi Khel Ratna award

ప్రస్తుతం భారత జట్టుకు టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న విరాట్ కోహ్లీ త్వరలోనే ధోని నుంచి వన్డే కెప్టెన్సీ పగ్గాలు కూడా అందుకోనున్నాడు. టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్న కోహ్లీ 2014, 2016లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నమెంట్‌లలో 'ప్లేయర్ ఆఫ ద టోర్నమెంట్' అవార్డుని అందుకున్నాడు.

విరాట్ కోహ్లీకి కేంద్రం ఈ అవార్డుని ప్రకటిస్తే క్రికెట్‌లో ఈ అవార్డుని అందుకున్న మూడవ క్రికెటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు. అంతకముందు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు (1997-98)లో, మహేంద్ర సింగ్ ధోనికి (2007-08)లో ఈ అవార్డుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కాగా, కోహ్లీని రాజీవ్ గాంధీకి సిఫారసు చేసిన బీసీసీఐ... ప్రస్తుతం టీమిండియా జట్టులో నిలకడగా రాణిస్తున్న అజ్యంకే రహానేను అర్జున అవార్డుకి సిఫారసు చేసింది. న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలను రహానే సాధించిన సంగతి తెలిసిందే.

ఖేల్‌రత్న అవార్డులో భాగంగా రూ. 7.5 లక్షల నగదుతో పాటు ప్రశంసా పత్రం, అదే విధంగా అర్జున అవార్డులో భాగంగా రూ. 5 లక్షల నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X