న్యూఢిల్లీ: భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్తో పోల్చవద్దని యువరాజ్ సింగ్ అన్నాడు. ఈ తరం క్రికెట్లో విరాట్ కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్సుమెన్ అని చెప్పాడు. అయితే, అతనిని సచిన్తో పోల్చడం మాత్రం సరికాదన్నారు.
సచిన్ స్థాయిని అందుకోవాలంటే కోహ్లి ఇంకా చాలా శ్రమించాలన్నాడు. అతను కూడా సచిన్లా గొప్ప ఆటగాడు కావాలన్నాడు. సచిన్ టెండుల్కర్లా కోహ్లీ వంద సెంచరీలు సాధించగలడా అని ప్రశ్నిస్తే... ఆ ఆలోచనే చాలా దూరమైనదని తన అభిప్రాయమని చెప్పాడు.
సచిన్లా ఎదగాలంటే కోహ్లీ చాలా హార్డ్ వర్క్ చేయాలన్నాడు. టెండుల్కర్ గొప్ప ఆటగాడని, అలాగే అతను భారత్కు గొప్ప అంబాసిడర్ అన్నాడు. ప్రస్తుతం కోహ్లీ గొప్ప ఫాంలో ఉన్నాడని చెప్పాడు. ఏదో ఒకరోజు కోహ్లి భారత్ తరఫున గొప్ప ఆటగాడవుతాడని ఆశిస్తున్నానని చెప్పాడు.
ప్రస్తుత తరంలో ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీలు గొప్ప ఆటగాళ్లని చెప్పాడు. కాబట్టి కోహ్లీ కూడా ఏదో ఓ రోజు భారత్ తరఫున గొప్ప ఆటగాడు అవుతాడని భావిస్తున్నానని చెప్పాడు. గాయం కారణంగా యువీ ఇప్పటి దాకా ఒక్క ఆట కూడా ఆడలేదు. శుక్రవారం జరిగే మ్యాచులో ఆడుతానని భావిస్తున్నానని చెప్పాడు. యువీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అని తెలిసిందే.