హైదరాబాద్: పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంతో ఓర్పు, సహనంతో ఉండాలని కెప్టెన్ కోహ్లీతో పాటు శిఖర్ ధావన్, యువీ, రాబిన్ ఊతప్పలు అన్నారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ వీడియోపై వీరంతా స్పందించారు. చిన్నపిల్లలు దైవంతో సమానమని, వారిని కొట్టొదని, దూషించవద్దని అన్నారు.
ఇంతకీ వీడియోలో ఏముందంటే?
'ఓ చిన్నారి తన పుస్తకంలో 1 నుంచి 5 వరకు రాసుకున్న అంకెలను చదువుతూ ఉంటుంది. సరిగ్గా చదవాలని ఆమె తల్లి పదే పదే కోపంగా చెప్పడంతో, ఆ చిన్నారి ఏడుస్తూ అంకెలను చదువుతుంది. అయినా సరే ఆ తల్లి చిన్నారిపై చేయిచేసుకుని దూషిస్తుంది' ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈ వీడియోని చూసిన భారత క్రికెటర్లు శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, రాబిన్ ఉతప్పలు స్పందించారు. 'తమ పిల్లల పట్ల ఏ సమయంలోనైనా తల్లిదండ్రులు ఎంతో ఓర్పుతో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి చిన్నారికి వారు స్వతహాగ నేర్చుకునే తత్వం ఉంటుంది. దయచేసి వారిని కొట్టొద్దు, దూషించొద్దు' అని ధావన్ తన ట్వీట్ చేశాడు.
I request parents to be patient with ur kids at all times. Every child learns at his own pace. Pls refrain from beating/degrading them. 🙏🙏 pic.twitter.com/jy8xV8gC9M
— Shikhar Dhawan (@SDhawan25) 19 August 2017
This is heart wrenching. Children shouldn't be raised this way. This needs to stop. I pray we can raise our kids with love instead of fear. pic.twitter.com/6R4mKrFy4r
— Robin Aiyuda Uthappa (@robbieuthappa) 19 August 2017
A post shared by Virat Kohli (@virat.kohli) on