నో కామెంట్
ఈ నేపథ్యంలో ఏ విషయంపైనైనా నేరుగా స్పందించే సెహ్వాగ్.. కోచ్ ఇంటర్వ్యూ గురించి ప్రశ్నిస్తే మాత్రం దాటవేస్తున్నాడు. మంగళవారం ఓ కార్యక్రమానికి హాజరైన అతడిని మీడియా.. బ్యాటింగ్, బౌలింగ్ కోచ్ల గురించి మీకేమైనా ముందే సమాచారం ఇచ్చారా? అని ప్రశ్నించగా.. ‘ఉమ్మీద్ ఇండియా (కార్యక్రమం) గురించి అడిగితేనే సమాధానం చెబుతాను' అని చెప్పాడు.
మా కష్టలెంత?
ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్షిప్లో అథ్లెట్ల కష్టాలపై మాట్లాడుతూ.. ‘ఇతర క్రీడాకారులతో పోల్చుకుంటే నా కష్టం అసలు లెక్కలోకే రాదు. నగరంలో ఏ మూలకు వెళ్లినా క్రికెట్ వసతులుంటాయి. మిగతా వారితో పోల్చుకుంటే క్రికెటర్లవి కష్టాలే కావు' అని సెహ్వాగ్ తెలిపాడు.
కోహ్లీ అయిష్టతే..
ఇది ఇలా ఉండగా, టీమిండియా కోచ్గా వీరేంద్ర సెహ్వాగ్ ఎంపికను విరాట్ కోహ్లీనే అడ్డుకున్నట్లు తెలుస్తోంది. వీరేంద్ర సెహ్వాగ్ ఎంపికపై కోహ్లీ తన అయిష్టతను కోచ్ ఎంపిక కమిటీకి తెలియజేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కోహ్లీ మద్దతు తెలపడంతో రవిశాస్త్రిని టీమిండియా హెడ్కోచ్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
రవిశాస్త్రివైపే...
అంతకుముందు ‘వీరూ పాపా భారత క్రికెట్కు ఎంతో గొప్ప సేవ చేశారు. ఆయనెంటో తమకు బాగా తెలుసు. సెహ్వాగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడంలో నాకేం సమస్య కాదు. ఎవరైనా టీమిండియాకు సేవ చేసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు' అని విరాట్ అన్నాడు. అయితే, సెహ్వాగ్ టీమిండియా కోచ్ పదవికి సరైన వ్యక్తని కోహ్లీ చెప్పకపోవడం వల్లే రవిశాస్త్రిని ఎంపిక కమిటీ కోచ్గా నియమించింది.