న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లవ్‌లీ వైజాగ్: సెహ్వాగ్ గూగ్లీకి కుంబ్లే బౌల్డ్

By Nageshwara Rao

విశాఖపట్నం: అంతర్జాతీయ క్రికెట్‌‌కు వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో తనదైన చమత్కారంతో అందరినీ అలరిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం సెహ్వాగ్ మరోసారి తనదైన శైలిలో సరదా ట్వీట్ పోస్టు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

విశాఖలో ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న ఐదో వన్డే శనివారం జరగనున్న సంగతి తెలిసిందే. వన్డే మ్యాచ్ కోసం భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు గురువారం ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్నాయి. ఇరు జట్ల ఆటగాళ్లు బీచ్‌ రోడ్డులోని నోవాటెల్‌ హోటల్లో బస చేస్తున్నారు.

Virender Sehwag's googly stumps Anil Kumble

జట్టుతో పాటు టీమిండియా ఛీప్ కోచ్ అనిల్‌ కుంబ్లే కూడా గురువారమే విశాఖ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్వతహాగా ఫొటోగ్రఫీ అంటే అమితంగా ఇష్టపడే కుంబ్లే తాను బస చేసిన హోటల్‌ నుంచి కెమెరాతో విశాఖ సముద్ర తీరాన్ని ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

Lovely Vizag!!!

A photo posted by Anil Kumble Official (@anil.kumble) on

ఈ పోస్టుకు స్పందించిన సెహ్వాగ్ 'మంచి ఫొటో తీశావు అనిల్‌ భాయ్‌. ప్రస్తుతం విశాఖకి కయాంత్‌ తుపాను ప్రమాదం పొంచి ఉంది కదా.. కామెంటేటర్‌గా నన్ను అక్కడకు రమ్మంటావా..? లేదా ఇంటికి వెళ్లిపొమ్మంటావా..? కాస్త చెప్తావా?' అని ట్వీట్‌ చేశాడు.

సెహ్వాగ్ ట్వీట్‌కు కుంబ్లే తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. సెహ్వాగ్‌కి దీపావళి శుభాకాంక్షలు చెప్తూనే.. ప్రకృతి విపత్తుని ఎవరూ ఊహించలేమంటూ పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన అనంతరం సెహ్వాగ్‌ కామెంటేటర్‌గా అభిమానుల్ని అలరిస్తున్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X