భారత్లో తొలిసారి పర్యటిస్తున్నాం
ఇలాంటి సమయంలో భారత్లో తొలిసారి పర్యటిస్తున్నామని చెప్పాడు. టీమిండియాతో ఆడటం బంగ్లాదేశ్కు పెద్ద సవాల్ అని, గొప్ప జట్టుతో ఆడే అవకాశం వచ్చినప్పుడు మా జట్టు సత్తా బయటపడుతుందని షకీబ్ చెప్పుకొచ్చాడు. యువ ఆటగాళ్లతో బంగ్లాదేశ్ జట్టు భారత్కు వచ్చిందని తెలిపాడు.
స్పిన్ మా బలం
స్పిన్ తమ బలమని, జట్టులో యువ ఫాస్ట్బౌలర్లు ఉన్నారని అన్నాడు. సమష్టి కృషితో భారత్కు పోటీ ఇవ్వాలని భావిస్తున్నామని చెప్పాడు. ఉపఖండంలో ఇప్పటివరకు మా బౌలర్లు బాగా రాణించారని చెప్పిన షకీబ్. బ్యాటింగ్ పరంగా కొంచెం మెరుగవ్వాలని పేర్కొన్నాడు. ఇక ఇక్కడి వికెట్ తన బౌలింగ్కు సరిగ్గా సరిపోతుందన్నాడు.
టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది
కానీ, టీమిండియా బ్యాటింగ్, స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోందని షకీబ్ అన్నాడు. ఇక అశ్విన్ గొప్ప బౌలర్. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ప్రపంచంలో ప్రస్తుతం అతడిని మించిన స్పిన్నర్ లేడు. రెండు మూడేళ్లుగా అశ్విన్ నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడని కొనియాడాడు.
కోహ్లీ అద్భుతమైన బ్యాట్స్మన్
ఇక టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే 'కోహ్లీ అద్భుతమైన బ్యాట్స్మన్. బ్యాటింగ్లో అతనికి తిరుగులేదు. అతను బ్యాటింగ్ చేసే విధానం గొప్ప ఉంటుంది. కోహ్లిని ఔట్ చేయడం అసాధ్యమన్న స్థాయిలో అతని బ్యాటింగ్ సాగుతోంది' అని షకీబ్ పేర్కొన్నాడు. బంగ్లా, భారత్ జట్ల మధ్య జరిగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 9 నుంచి 13వ వరకు హైదరాబాద్లో జరగనుంది.