జాదవ్ సిక్సుకు మురిసిన కోహ్లీ
ఆటలో భాగంగా కేదార్ జాదవ్ ఆఫ్ సైడ్ ఓ సిక్సర్ కొట్టినప్పుడు కోహ్లీ ఎంతో మురిసిపోయాడు. జాదవ్ దగ్గరకొచ్చి భుజం తడుతూ అతని తలపై చేయి వేసి ఊపుతూ అభినందించాడు. తొలి వన్డేలో సెంచరీ చేసిన వీరిద్దరూ ఐదో వికెట్కు 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
జాదవ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
76 బంతుల్లో 120 పరుగులు చేసిన కేదార్ జాదవ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ ముగిసిన వెంటనే అవార్డు అందుకున్న సమయంలో గొప్ప ఇన్నింగ్స్ ఆడారు అన్న ప్రశ్నకు
‘ఇలా దేశం కోసం కోహ్లీ ఎన్నోసార్లు ఆడాడు' అని బదులిచ్చి అందరి అభిమానం సంపాదించుకున్నాడు.
మరచిపోలేని అనుభూతి
భారత విజయాల్లో తన పాత్ర ఉండాలని ఎప్పుడూ కోరుకుంటానని, అందులోనూ సొంత మైదానంలో సెంచరీ చేసి జట్టుకు చక్కటి విజయాన్ని అందివ్వడం మరచిపోలేని అనుభూతిగా పేర్కొన్నాడు. తన కుటుంబ సభ్యులు సమక్షంలో కీలక ఇన్నింగ్స్ ఆడటం ఆనందంగా ఉందన్నాడు.
కోహ్లీతో పరిగెత్తడం కష్టమే
భారీ పరుగులను ఎలా చేధించాలో కెప్టెన్ కోహ్లీ తనతో చెప్పడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చాడు. కోహ్లీ ఆటను దగ్గరగా చూసే అవకాశం ఈ మ్యాచ్లో దక్కిందని, గతంలో కొన్నిసార్లు కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేసే అవకాశాన్ని మిస్సయ్యానని అన్నాడు. కోహ్లీతో పరిగెత్తడం కష్టమేనని మనసులో మాటను చెప్పాడు.