హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే అండర్-19 వరల్డ్ కప్ పోటీలకు సంబంధించిన షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. న్యూజిలాండ్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నమెంట్ జనవరి 2018 13 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరగనుంది. తొలి మ్యాచ్లో భాగంగా డిపెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ ఆతిథ్య న్యూజిలాండ్తో తలపడనుంది.
ఇక భారత్ తన తొలి మ్యాచ్లో భాగంగా ఆసీస్తో తలపడనుంది. టెస్టు ర్యాంకింగ్స్లో టాప్-10లో ఉన్న జట్లు ఈ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయని, ఆ తదుపరి స్థానాల్లో ఉన్న జట్ల మధ్య అర్హత మ్యాచ్లు జరగనున్నాయని ఐసీసీ తెలిపింది. టోర్నీలో భాగంగా భారత జట్టు గ్రూప్-బిలో ఉంది.
Earlier today the fixtures for the 2018 #U19CWC, which will take place in New Zealand, were announced.
— ICC (@ICC) 17 August 2017
🗓️ https://t.co/R3kX9buecp pic.twitter.com/3zymqwqGBi
కాగా, 2000 సంవత్సరంలో మహ్మద్ కైఫ్ నాయకత్వంలో భారత్ తొలిసారి అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత 2008లో విరాట్ కోహ్లీ, 2012లో ఉన్ముక్త్ చంద్ నేతృత్వంలో భారత అండర్-19 జట్టు వరల్డ్ కప్ని గెలుచుకుంది.
The ICC has revealed the schedule for the U19 Cricket World Cup to be hosted by New Zealand this January #U19CWC
— ICC (@ICC) 17 August 2017
➡️ https://t.co/f5IvJ3JM7h pic.twitter.com/TsaeL9twj3
U-19 వరల్డ్ కప్:
గ్రూప్ A: West Indies, South Africa, New Zealand, Kenya
గ్రూప్ B: India, Zimbabwe, Australia, PNG
గ్రూప్ C: Bangladesh, England, Namibia, Canada
గ్రూప్ D: Sri Lanka, Pakistan, Afghanistan, Ireland