హరారే: జింబాబ్వేతో జరిగిన మూడో ట్వంటీ 20లో భారత్ గెలిచి.. 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మూడో ట్వంటీ 20 సందర్భంగా సరిగా కనిపించనప్పటికీ, అలాగే తనకు బంతి తగిలి నొప్పి కలిగినప్పటికీ ధోనీ కీపింగ్ చేశాడు.
భారత్ వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ అయిన ధోనీ తొలిసారి సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోను పెట్టాడు. తనకు బంతి తగిలిందంటూ ఫోటో పెట్టాడు. ఆ బంతి ధోనీ కంటి వద్ద తగిలింది. అయినప్పటికీ ధోనీ అలాగే కీపింగ్ చేశాడు. ధోనీ ఇన్స్టాగ్రాంలో ఫోటోను షేర్ చేశాడు.
జింబాబ్వేపై కష్టపడి గెలుపు, సిరీస్ భారత్ వశం: చివరి ఓవర్ తీవ్ర ఉత్కంఠ ఇలా..
కాగా, మూడో ట్వంటీ 20లో భారత్.. జింబాబ్వే పైన కష్టపడి గెలిచింది. తొలుత జింబాబ్వే స్కోరు చూస్తే సులభంగా గెలుస్తుందని భావించారు. కానీ ఆ తర్వాత మన బౌలర్లు కట్టడి చేశారు. దీంతో భారత్ మూడు పరుగుల తేడాతో గెలిచి సిరీస్ గెలుచుకున్న విషయం తెలిసిందే.