ఇండోర్: న్యూజిలాండ్తో ఇండోర్లో ఇటీవల ముగిసిన మూడో టెస్టులో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. టెస్టు మ్యాచ్ని వీక్షించడానికి వచ్చిన అభిమానులకు ఒకేసారి ఇద్దరు విరాట్ కోహ్లీలు దర్శనమివ్వడంతో ఆనందంలో తేలిపోయారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిఒక కోహ్లీ ఏమో ప్రేక్షకులు ఉండే స్టాండ్స్లో కూర్చోగా, మరో కోహ్లీ మన టీమిండియా టెస్టు కెప్టెన్. ఇద్దరినీ ఒకేసారి చూడటంతో అభిమానులు విస్తుపోయారు. ఇక్కడ విచిత్రమేమిటంటే మ్యాచ్లో తెరపై కనిపించిన కోహ్లీ అచ్చం మన కెప్టెన్ కోహ్లీలాగే ఉన్నాడు.
ఇండోర్ టెస్టు మ్యాచ్లో అచ్చం తనలాగే ఉన్న అతడిని చూసిన కోహ్లీకి నవ్వు ఆగలేదు. చేయి అడ్డం పెట్టుకొని మరీ చప్పట్లు కొడుతూ నవ్వుల్లో మునిగిపోయాడు. ఇండోర్ టెస్టు మ్యాచ్ రెండో రోజు మూడవ సెషన్లో స్టాండ్స్లో అచ్చం కోహ్లిలాగా ఉండే ఆయన డూప్ ఒకరు హల్చల్ చేశాడు.
లంకపై 133 నాటౌట్: కోహ్లీ ఎందుకంటే ప్రత్యేకమన్న గంగూలీఅచ్చం కోహ్లి పోలికలతో ఉన్న అతడితో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రేక్షకులు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఈ డూప్లికేట్ కోహ్లి వెంట అభిమానులు పడిన దృశ్యం కెమెరా కంటపడింది. మైదానంలో పెట్టిన టీవీ స్క్రీన్లలో తరచూ కనిపించిన ఈ దృశ్యాన్ని చూసి నిజమైన కోహ్లి విస్తుపోయాడు.
ఉద్వేగానికి లోనయ్యారు: కోచ్కు సర్ప్రైజ్ గిప్ట్ ఇచ్చిన కోహ్లీకామంటేటరీ బాక్సులో ఉన్న సంజయ్ మంజ్రేకర్ కూడా దీనిపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సరదా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఫేస్బుక్లో పెట్టిన ఈ వీడియోను ఇప్పటి వరకు ఐదులక్షల మందికిపైగా చూడగా 6,400సార్లు దీనిని షేర్ చేసుకున్నారు.