న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ రికార్డు: టీ20 క్రికెట్‌లో 300 పరుగులు చేసిన ఢిల్లీ కుర్రాడు

By Nageshwara Rao

హైదరాబాద్: టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నమోదైంది. ఢిల్లీకి చెందిన మోహిత్ ఆహ్లావాట్ అనే బ్యాట్స్‌మెన్ టీ20 క్రికెట్‌లో 300 పరుగులు నమోదు చేశాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో 300 పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్ మెన్‌గా చరిత్ర సృష్టించాడు.

21 ఏళ్ల మోహిత్ ఆహ్లావాట్ రంజీ ట్రోఫీలో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 72 బంతుల్లో 14 ఫోర్లు, 39 సిక్సులతో ట్రిపుల్ సెంచరీని సాధించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో 34 పరుగులు రాబట్టిన మోహిత్ చివరి ఐదు బంతుల్లో 5 సిక్సులు బాదాడు.

 World record: Delhi's Mohit Ahlawat smashes 300 in T20 cricket

దీంతో మోహిత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 416 పరుగులు చేసింది. ఫ్రెండ్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మావి XI Vs ఫ్రెండ్స్ XI జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మోహిత్ ఈ ఘనతను సాధించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా 2015లో రాజస్ధాన్‌పై జరిగిన మ్యాచ్‌లో మోహిత్ క్రికెట్ అరంగేట్రం చేశాడు.

ఇదిలా ఉంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు చెందిన వెస్టిండిస్ ఆటగాడు 175 పరుగులు నమోదు చేశాడు. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్ 156 పరుగులే ఇప్పటివరకు అత్యధికం.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X