న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అసలేం జరిగింది?: ఫ్లిప్‌కార్ట్‌‌తో జడేజా గొడవ, ఎందుకు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీదారు షియోమి తన ఆల్ రౌండర్ ఫోన్ రెడ్‌మీ నోట్ 4ను ఈనెల 19న విడుదల చేస్తోంది.

By Nageshwara Rao

హైదరాబాద్: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీదారు షియోమి తన ఆల్ రౌండర్ ఫోన్ రెడ్‌మీ నోట్ 4ను ఈనెల 19న విడుదల చేస్తోంది. షియోమి రెడ్‌మీ నోట్ 4ను కేవలం తమ వెబ్‌సైట్‌లో మాత్రమే అమ్మకాలు కొనసాగిస్తున్నామని ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఒక ట్వీట్ చేసింది.

''భారత కొత్త ఆల్‌రౌండర్ జనవరి 19న మమ్మల్ని విజిట్ చేస్తున్నారు. ఎవరో ఏంటో తెలుసా?'' అని అందులో పేర్కొంది. అయితే ఈ ట్వీట్‌... టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ఎంత మాత్రం నచ్చినట్టు లేదు. దీంతో ఈ ట్వీట్‌కు వెంటనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించాడు.

'ఈ కొలవెరి ఢీ ఎందుకు? ఆ ప్రకటన చేయడానికి ముందు తనను సంప్రదించాలి కదా, ఎందుకు చేయలేదు అంటూ ఆ కార్యక్రమాన్ని జనవరి 20వ తేదీకివాయిదా వేయండి' అంటూ ట్వీటీ చేశాడు. తనకు 19వ తేదీన ఒక మ్యాచ్ ఉంది కాబట్టి అలా చేయాలని సూచించాడు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నెటిజన్లు సైతం ఈ ట్వీట్‌పై తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను అందిస్తున్న షియోమి సంస్ధ షియోమి రెడ్‌మి నోట్ 3 మార్కెట్లో బాగా అమ్మకాలు జరపడంతో దాదాపు దాని ధరలోనే మరికొంత అప్‌గ్రేడెడ్ వెర్షన్, మరింత ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో నోట్ 4ను తీసుకొస్తోంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X