హైదరాబాద్: సుదీర్ఘకాలం పాటు టీమిండియాకు దూరంగా ఉన్న వెటరన్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, అశిష్ నెహ్రాలను ఇంగ్లాండ్తో జరగనున్న వన్డే, టీ20 సిరిస్లకు సెలక్టర్లు వీరిద్దరిని ఎంపిక చేసి చాలామంది ఆశ్చర్యపరిచారు. వీరి ఎంపికపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.
వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకున్న నేపథ్యంలో పరిమిత ఓవర్ల కెప్టెన్గా సెలక్టర్లు కోహ్లీని నియమించారు. కోహ్లీ వల్లే యువీకి భారత జట్టులో చోటు దక్కిందని ఇప్పటికే ట్విట్టర్లో పలు ట్వీట్లను మనం చూశాం. తాజాగా తనపై వచ్చిన జోకును యువరాజ్ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.
తనతోపాటు టీమిండియా పేసర్ ఆశిష్ నెహ్రా ఉన్న ఫొటోపై బీసీసీఐ ఇప్పటికీ పాత 500, వెయ్యి నోట్లను తీసుకుంటోంది అన్న కామెంట్ను పోస్ట్ చేశారు కొందరు నెటిజన్లు. ఆ ఫొటోను యువరాజ్ కూడా షేర్ చేస్తూ ఎవరు చేశారోగానీ బాగుంది అని పేర్కొనడం విశేషం.
పైఫోటోను యువరాజ్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన ఈ ఫొటోకు ఇప్పటికే 80 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత యువరాజ్ సింగ్ జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
మరోవైపు ఆశిష్ నెహ్రా ఆర్నెళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే దీనిని యువీ అభిమానులు సైతం స్వాగతిస్తున్నారు. ఈ పాత నోట్లు ఇప్పటికీ పనిచేస్తాయని ఒకరంటే.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే జనవరి 15న ఇంగ్లాండ్తో పూణెలో తొలి వన్డే ప్రారంభం కానుంది.