ముంబై: టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ గంజాయి తాగుతాడు, డ్రగ్స్కు బానిస అంటూ యువీ తమ్ముడి మాజీ భార్య ఆకాంక్ష శర్మ చేసిన ఆరోపణలపై తండ్రి యోగిరాజ్ సింగ్ స్పందించారు. తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అసలు ఆమె (చిన్న కొడుకు మాజీ భార్య ఆకాంక్ష శర్మ) అర్ధం లేని మాటలు మాట్లాడుతోందని ఆమె చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆయన కొట్టి పారేశారు. తాను నలుగురు పిల్లలకు తండ్రినని గర్వంగా చెప్పిన యోగిరాజ్ సింగ్, తన పిల్లలు ఎవరూ డ్రగ్స్కు బానిసలు కాదని పేర్కొన్నాడు.
యువీతో పాటు తన ముగ్గురు పిల్లలను సింహాలతో పోల్చాడు. తన పిల్లలు ఏమీ గడ్డి తినడం లేదని కాస్తంత ఘాటుగానే స్పందించారు. ముందు ఆకాంక్ష శర్మ తన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవాలని యువీ తండ్రి యోగిరాజ్ సూచించారు. యువీ గంజాయి తాగేవాడని రియాలిటీ షో బిగ్బాస్ 10లో పాల్గొన్న ఆకాంక్ష శర్మ ఆరోపించిన సంగతి తెలిసిందే.
బిగ్బాస్ షో నుంచి బయటకు వచ్చిన ఆకాంక్ష శర్మ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను గంజాయి తాగేవాడినని యువరాజ్ సింగ్ స్వయంగా తనకు చెప్పినట్టు ఆమె చెప్పుకొచ్చింది. యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్ సింగ్ కి తానంటే భయమని యువీ సోదరుడు జొరావర్ భార్య ఆకాంక్ష శర్మ సంచలన వ్యాఖ్యలు చేసింది.
యువీ గంజాయి తాగేవాడు: బాంబు పేల్చిన తమ్ముడి మాజీ భార్య
యువీ కుటుంబంపై గతంలో కూడా ఆరోపణలు గుప్పించిన ఆకాంక్ష, రెండేళ్ల క్రితం జొరావర్ ను పెళ్లి చేసుకుంది. మనస్పర్థల కారణంగా కేవలం నాలుగు నెలలకే విడిపోయారు. జొరావర్కు, తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని, కేవలం యువీ తల్లి షబ్నం సింగ్ కారణంగా నాలుగు నెలలకే తాము విడిపోయామని పేర్కొంది.
విడాకులు ఇస్తే ఇస్తే తన జీవితాన్ని తాను చూసుకుంటానని చెప్పింది. తాను చెప్పిన విషయాలు వాస్తవాలు కాబట్టే షబ్నం భయపడుతోందని, అందుకే, ఆమె అంత తీవ్రంగా స్పందిస్తోందని ఆకాంక్ష వివరించడం విశేషం. కాగా, యోగిరాజ్ సింగ్ భారత జట్టు తరుపున ఒక టెస్టు, ఆరు వన్డేలు ఆడాడు.