హైదరాబాద్: టీమిండియా వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్ శుక్రవారం క్యాన్సర్ బాధిత చిన్నారులను కలిశారు. ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన యువరాజ్ సింగ్ మ్యాచ్ తర్వాత కటక్లోని ఓ క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లాడు.
అక్కడున్న క్యాన్సర్ బాధిత చిన్నారులతో యువరాజ్ కొంత సమయాన్ని గడిపాడు. ఈ సందర్భంగా చిన్నారులతో సరదాగా గడిపిన యువీ వారితో ఫోటోలు దిగాడు. తమ అభిమాన క్రికెటర్ని కలవడం పట్ల చిన్నారులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. 2011 వరల్డ్ కప్ అనంతరం యువీ క్యాన్సర్ బారిన పడ్డాడు.
అయితే కీమోథెరపీ సాయంతో ఆ మహమ్మారిని జయించిన సంగతి తెలిసిందే. ఆ పోరాటం తర్వాతే యువరాజ్ యూవీకెన్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేసి క్యాన్సర్ బాధితులకు సాయం చేస్తున్నాడు. అందులో భాగంగానే మ్యాచ్ ముగిసిన తర్వాత యువరాజ్ ఆ ఆసుపత్రికి వెళ్లాడు.
మూడు వన్డేల సిరిస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం కటక్లో రెండో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ వన్డేలో ఇంగ్లాండ్పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ సిరిస్లో ఇంకో మ్యాచ్ మిగులుండగానే 2-0తో సిరిస్ను కైవసం చేసుకుంది. కటక్ వన్డేలో యువరాజ్ సింగ్ చెలరేగాడు.
సుమారు ఆరేళ్ల తర్వాత సెంచరీ సాధించాడు. ఇది యువీకి 14వ సెంచరీ కావడం విశేషం. ఇక ఈ సిరిస్లో చివరిదైన మూడో వన్డే ఆదివారం (జనవరి 22)న కోల్కతాలో జరగనుంది.
The Man of the Moment - @YUVSTRONG12 adds smiles to the faces of cancer heroes #INDvENG pic.twitter.com/h54PPWtIsu
— BCCI (@BCCI) 20 January 2017