న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్‌కు 'డబుల్' అవార్డ్: సతీమణితో సచిన్ (పిక్చర్స్)

By Srinivas

ముంబై: వన్డేల్లో 264 పరుగులతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన రోహిత్‌ శర్మకు మహారాష్ట్ర రాజధాని ముంబైలో సన్మానం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు. రోహిత్ శర్మకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్, నీతా అంబానీలు శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. బీసీసీఐ ప్రకటించిన సీకే నాయుడు అవార్డును శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో వెంగ్‌సర్కార్ అందుకున్నాడు.

అతనికి జ్ఞాపికతోపాటు 25 లక్షల రూపాయల చెక్కు కూడా లభించింది. పాలీ ఉమ్రీగర్ అవార్డు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు దక్కింది.

సచిన్, అంజలి

సచిన్, అంజలి

ఇటీవల 264 పరుగులతో ప్రపంచ రికార్డ్ సృష్టించిన రోహిత్ శర్మకు ముంబైలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి వస్తున్న సచిన్, అంజలి.

వెంగ్ సర్కార్

వెంగ్ సర్కార్

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. బీసీసీఐ ప్రకటించిన సీకే నాయుడు అవార్డును శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో వెంగ్‌సర్కార్ అందుకున్నాడు.

రిషి ధావన్

రిషి ధావన్

ముంబైలో బీసీసీఐ ట్రెజరర్ అనిరుధ్ చౌదరి రిషీ ధావన్‌కు అవార్డు అందిస్తున్న దృశ్యం. పర్వేజ్ రసూల్, కేదార్ జాదవ్, వినయ్ కుమార్, రాహుల్ త్రిపాఠి, బి అనిరుద్ధ్, శుభం గిల్, స్మృతి మంధానా, అనీల్ చౌదరి కూడా అవార్డులు స్వీకరించారు.

పర్వేజ్ రసూల్

పర్వేజ్ రసూల్

ముంబైలో బీసీసీఐ సెక్రటరీ సంజయ్ పటేల్ పర్వేజ్ రసూల్‌కు అవార్డు అందిస్తున్న దృశ్యం. రిషీ ధావన్, కేదార్ జాదవ్, వినయ్ కుమార్, రాహుల్ త్రిపాఠి, బి అనిరుద్ధ్, శుభం గిల్, స్మృతి మంధానా, అనీల్ చౌదరి కూడా అవార్డులు స్వీకరించారు.

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

శ్రీలంకతో కోల్‌కతాలో జరిగిన నాలుగో వన్డేలో 264 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన రోహిత్ శర్మకు ప్రత్యేక అవార్డు లభించింది.

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

బీసీసీఐ సెక్రటరీ సంజయ్ పటేల్ భారత సారథి విరాట్ కోహ్లీకి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలుపుతున్న దృశ్యం. భారత్ శనివారం ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరింది.

భువనేశ్వర్ కుమార్

భువనేశ్వర్ కుమార్

మహారాష్ట్ర రాజధాని ముంబైలో బీసీసీఐ సెక్రటరీ సంజయ్ పటేల్ భువనేశ్వర్ కుమార్‌కు గురువారం నాడు అవార్డు అందిస్తున్న దృశ్యం.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X