న్యూఢిల్లీ: నాలుగు టెస్టుల సిరిస్లో భాగంగా డిసెంబర్ 4 నుంచి బ్రిస్బేన్లో జరగాల్సిన మ్యాచ్ ఆస్టేలియా క్రికెటర్ ఓపెనర్ ఫిలిప్ హ్యూస్ మృతి చెందడంతో రద్దయ్యే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.
ఐతే ఆస్టేలియా మాజీ కెప్టెన్లు ఇయాన్ ఛాపెల్, మార్క్ టేలర్ మాత్రం మ్యాచ్ని రద్దు చేయకుండా నిర్వహించాల్సిందిగా కోరుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆసీస్ క్రికెట్ అభిమానులు ఫిలిప్ హ్యూస్ మరణం నుంచి తేరుకునేందుకు సహాయపడుతుందని పేర్కొన్నారు.
మార్క్ టేలర్ మాట్లాడుతూ ఫిలిప్ హ్యూస్ మరణ వార్త క్రీడాకారులు కష్టమని అనిపించినా... ఐతే క్రికెట్ బహుశా నొప్పిని నయం చేసే ఉత్తమ ఔషధమని చెప్పారు. మంగళవారం జరగాల్సిన మ్యాచ్ గురించి ఆటగాళ్లు ఒకరికొకరు మాట్లాడుకుంటే మంచిదని పేర్కొన్నారు. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అని అన్నారు.
ఆస్టేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో న్యూ సౌత్ వేల్స్, సౌత్ ఆస్టేలియా మధ్య జరిగిన దేశవాళీ టోర్నీలో బౌలర్ అబ్బాట్ వేసిన బంతి బలంగా తలను తాకడంతో సిడ్నీలోనిసెయింట్ విన్సెంట్లో ఆసుపత్రిలో చికిత్స అందించారు. చికిత్స కోసం కృత్రిమంగా కోమాలోకి తీసుకెళ్లిన రెండు రోజులు పాటు మృత్యువుతో పోరాడి గురువారం ఉదయం మరణించిన సంగతి తెలిసిందే.
ఫిలిప్ హ్యూస్ సెయింట్ విన్సెంట్లో చికిత్స్ పొందుతున్న తరుణంలో ఆస్టేలియా మైఖెల్ క్లార్క్, వైస్ కెప్టెన్ బ్రాడ్ హడిన్ కూడా సందర్శించిన విషయం తెలిసిందే. ఫిలిప్ హ్యూస్ మృతికి సంతాపంగా టీమిండియా ఆడాల్సిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ను రద్దు చేశారు. ఆసీస్ పర్యటనలో భారత్ సన్నాహకాల్లో భాగంగా ఈ మ్యాచ్ ను ఏర్పాటు చేశారు.
ఇప్పుడు డిసెంబర్ 4 నుంచి బ్రిస్బేన్లో జరగాల్సిన తొలి టెస్టు కూడా రద్దవుతుందని వార్తలు రావడంతో, ఫిలిప్ హ్యూస్ కుటుంబం స్పందించింది. హ్యూస్ కుటుంబం తరపున దక్షిణ ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం సీఈఓ కీత్ బ్రాడ్ షా మాట్లాడారు. తొలి టెస్టు జరగాలని హ్యూస్ కుటుంబం కోరుకుంటోందని తెలిపారు.
దక్షిణ ఆస్ట్రేలియాలో తాము నిర్వహించిన ఎన్నో కోచింగ్ క్యాంపుల్లో హ్యూస్ చిన్నారులకు శిక్షణ ఇచ్చాడని బ్రాడ్ షా గుర్తు చేసుకున్నారు. పిల్లలు అతడిని ఎంతో ప్రేమించేవారని చెప్పారు. ఆ చిన్నారుల హృదయాల్లో హ్యూస్ చిరస్థాయిగా నిలిచిపోతాడని పేర్కొన్నారు.