బెంగళూరు: ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్) టోర్నీ 14వ వారానికి చేరుకున్నా లీగ్ జెయింట్స్లో మాంఛెస్టర్ సిటీపై జరిగిన మ్యాచ్లో విజయంతో చెల్సియా ఆధిక్యం కనబరిచింది. మాంఛెస్టర్ సిటీపై చెల్సియా 3 - 1 స్కోర్ తేడాతో విజయం సాధించింది. మాంఛెస్టర్ సిటీపై జరిగిన మ్యాచ్ లో చెల్సియా ఎఫ్ సి చివరి అర్థగంటలో మూడు గోల్స్ సాధించి విజయాన్ని సొంతం చేసుకున్నది.
సెర్జియో అగౌరె దూసుకు వెళ్లడంతోపాటు ఫెర్నాండిన్హో ప్రత్యర్థిపై విజ్రుంభిస్తూ గోల్స్ సాధించడంతో మాంఛెస్టర్ సిటీ జట్టుకు కోలుకోలేని పరాజయం మిగిలింది. మాంఛెస్టర్ సిటీ కేవలం మ్యాచ్లో మాత్రమే ఓటమి పాలవ్వడమే కాదు జెయింట్స్ టీం గా వారి అవకాశాలు మిస్సయ్యారు. కాగా, చెల్సియా టీంకిది వరుసగా ఎనిమిదో విజయం.
చెల్సియా హెడ్ కోచ్ అంటోనియో కాంటే మ్యాచ్ కోసం 3-4-3 ఫార్మాట్ వ్యూహంతో బరిలోకి దించడంతోపాటు ప్రత్యర్థి జట్టు కుర్రాళ్లు ఎదుర్కోలేని ఫార్వర్డ్ విభాగాన్ని ముందుకు తీసుకెళ్లడంతో మాంఛెస్టర్ సిటీపై విజయం సాధ్యమైంది. ఇక మాంఛెస్టర్ సిటీ నాలుగు పాయింట్లు కోల్పోగా, చెల్సియా కంటే నాలుగు స్థానాలు వెనుకబడి ఉంది.