ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలతోపాటు అమెరికాలో U-17 జట్టు పర్యటన
తమ జట్టు ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలతోపాటు అమెరికాలలో పర్యటిస్తుందన్నాడు. ‘ఈ ఎక్స్ పోజర్ ట్రిప్స్ పూర్తిస్థాయిలో ప్లేయర్లు తమ ఆటతీరును స్థిర పరుచుకునేందుకు ఉపకరిస్తాయి. కుర్రాళ్లలో పోటీ తత్వాన్ని మెరుగుపర్చడంతోపాటు జట్టు కెమిస్ట్రీ నిర్మాణానికి, కుర్రాళ్లు తమ బలహీనతలు తెలుసుకుని శక్తి సామర్థ్యాలు పెంపొందించుకునేందుకు సహకరిస్తాయి' అని నికోలయ్ ఆడం చెప్పాడు.
రవీంద్ర సరోవర్, బరాసత్ స్టేడియంలు తనిఖీచేసిన ఐ - లీగ్
కోల్కతాలోని రవీంద్ర సారోవర్, బరాసత్ స్టేడియంలలో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని ఐ - లీగ్ సిఇఓ సునందో ధార్ తెలిపారు. రెండు స్టేడియంల వద్ద పరిస్థితిని తనిఖీచేసిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమయ్యే టోర్నీలో సిటీ జెయింట్ టీంలు ఈస్ట్ బెంగాల్ జట్టు రవీంద్ర సరోవర్, మొహున్ బగన్ జట్టు బరాసత్ స్టేడియంలను తమ సొంత స్టేడియంలుగా పరిగణిస్తున్నాయి. సిలిగిరిలోని కాంచెంజుంగా స్టేడియంలోనూ మ్యాచ్ లు జరిపేందుకు అంగీకారం కుదిరిందన్నాడు.
వసతులు మెరుగు పడితేనే ఉపయోగించుకుంటాం
‘రవీంద్ర సరోవర్ స్టేడియంలో వసతులు మెరుగు పడితే మేం కూడా మెరుగ్గా ఉపయోగించుకుంటాం' అని సునందోధర్ అన్నాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫ్రాంచైసీ అట్లెటికో డీ కోల్ కతాతో కలిసి ఈస్ట్ బెంగాల్, మొహున్ బగన్ క్లబ్ యాజమాన్యాలు స్టేడియంలలో ఫ్లడ్ లైట్ల నిర్మాణం, తదితర తాత్కాలిక వసతులు అందుబాటులోకి తీసుకొస్తాయన్నాడు. వచ్చే ఏడాది జనవరి ఏడో తేదీ నుంచి ఐ - లీగ్ టోర్నీ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే.
ఇండియన్ పుట్ బాల్ అసోసియేషన్కు లేఖ
ఐ - లీగ్ టోర్నీలో పాలుపంచుకోవాల్సిందిగా అట్లెటికో డీ కోల్కతా జట్టు ఫ్రాంచైసీ యాజమాన్యంతో ఈస్ట్ బెంగాల్, మొహున్ బగన్ క్లబ్ యాజమాన్యాలు సంప్రదిస్తున్నాయన్నాడు. వచ్చే ఏడాది యు - 17 వరల్డ్ కప్ టోర్నీ కోసం ఆధునీకరిస్తున్నందున స్టాల్ లేక్ స్టేడియం, బరాసత్ స్టేడియం తమకు అందుబాటులో ఉండవని సునందోధర్ తెలిపాడు. అయితే ప్రస్తుతం ఆయా స్టేడియంలలో వసతుల కల్పన ప్రక్రియ కొనసాగుతున్నాయని, తాము ఇండియన్ పుట్ బాల్ అసోసియేషన్ కు లేఖ రాస్తామన్నాడు. ఐ - లీగ్ టోర్నీ ప్రారంభానికి ముందు రెండు క్లబ్ ల యాజమాన్యాలతో సమావేశమవుతామని వివరించాడు.