మునిచ్ ప్రమాదం (1958)
టేకాఫ్లో సమస్య వల్ల బ్రిటిష్ యూరోపియన్ ఎయిర్వేస్కు చెందిన విమానం క్రాష్ అయ్యింది. వెస్ట్ జర్మనీలోని మ్యునిచ్ విమానాశ్రయంలో 1958, ఫిబ్రవరి 6న ఈ సంఘటన చోటు చేసుకుంది. మూడో ప్రయత్నంలో టేకాఫ్ తీసుకున్నా విమానం సరైన దిశలో పైకి లేవకపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. విమానంలో మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ జట్టుతో పాటు అభిమానులు, జర్నలిస్ట్లు ఉన్నారు. 44 మంది ప్రయాణికుల్లో 23 మంది మరణించారు.
ది హిల్స్ బరో దుర్ఘటన (1996)
ప్రపంచ పుట్ బాల్ చరిత్రలోనే ది హిల్స్ బరో దుర్ఘటనను ఓ చీకటి అధ్యయనంగా భావిస్తారు. ఇంగ్లాండ్ పుట్ బాల్ చరిత్రలో ఇది దురదృష్టకర సంఘటన. ఎఫ్ఏ కప్ మ్యాచ్లో భాగంగా నాటింగ్ హామ్, లివర్ పూల్ జట్ల మధ్య గేమ్ ఆడుతున్న సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 776 మంది అభిమానులు గాయలు పాలవ్వగా, 96 మంది చనిపోయారు.
పైలట్ తప్పిదం వల్ల (1977)
ఇవాన్స్విల్లీ బాస్కెట్బాల్ జట్టును తీసుకెళ్తున్న చార్టెడ్ ఫ్లయిట్ పొగమంచు, వర్షం కారణంగా ఎయిర్పోర్ట్కు సమీపంలో కుప్పకూలింది. క్రాస్ల్యాండింగ్ కావడంతో జట్టు, కోచింగ్ సిబ్బందిలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదు. పైలట్ తప్పిదం వల్లే ఘటన జరిగిందని విచారణలో తేలింది. టేకాఫ్ తర్వాత కీలకమైన రుడెర్, కంట్రోల్లాక్స్ను తీసేయడం మర్చిపోయాడని విచారణలో తేల్చారు.
పోలిష్ ఎయిర్లైన్స్ విమానం (1980)
అమెరికా బాక్సింగ్ జట్టుతో ప్రయాణిస్తున్న పోలిష్ ఎయిర్లైన్స్ విమానం మెకానికల్ వైఫల్యంతో 1980లో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 87 మంది ప్రయాణికులు మృతిచెందారు. అమెరికా తరఫున ఒలింపిక్స్కు క్వాలిఫై అయిన చాలా మంది బాక్సర్లు ఈ ప్రమాదంలో మరణించడంతో ఆ దేశం మాస్కో (1980) ఒలింపిక్స్ను రద్దు చేసుకుంది.
బ్రాడ్ ఫోర్డ్ సిటీ స్టేడియం (1985)
ఇంగ్లాండ్ పుట్ బాల్ చరిత్రలో బ్రాడ్ ఫోర్డ్ సిటీ స్టేడియం దుర్ఘటన కూడా అతి పెద్దది. గ్యాలరీలో ఓ అభిమాని సిగరెట్ పీకును వేయడంతో నిప్పంటుకుని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 450 మంది గాయాలు పాలవ్వగా, 56 మంది ప్రాణాలు కోల్పోయారు.
మిలిటరీ విమానం (1993)
సెనెగల్లో మ్యాచ్ కోసం జింబాబ్వే జాతీయ ఫుట్బాల్ జట్టును తీసుకెళ్తున్న మిలిటరీ విమానం ఇంజన్ సమస్యతో 27 ఏప్రిల్ 1993లో ప్రమాదానికి గురైంది. 1994 వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆడేందుకు 30 మంది ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది మొత్తం సంఘటన స్థలంలోనే మరణించారు. ఇందులో 18 మంది ఫుట్బాల్ క్రీడాకారులు, జట్టు కోచ్ అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు.
పోర్టో సెడ్ స్టేడియం దుర్ఘటన (2012)
2012లో జరిగిన ఈజిప్టులో జరిగిన అతిపెద్ద ప్రమాదాల్లో ఇదొకటి. ఆల్-మస్రీ, ఆల్-ఆల్కీ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో ఆల్ మస్రీ 3-0తో విజయం సాధించింది. ఈ ఓటమిని తట్టుకోలేని ఆల్-ఆల్కీ జట్టు అభిమానులు ప్రత్యర్ధి జట్టు అభిమానులపై కత్తులు, బాటిళ్లు, చెక్కలతో దాడి చేశారు. ఈ ప్రమాదంలో 79 మంది చనిపోగా, 1000కి పైగా అభిమానులు గాయపడ్డారు.