ముంబై: సీనియర్ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీహర్ ఖాన్లకు వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్ ప్రాబబుల్స్ జాబితాలో చోటు దక్కలేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలక్షన్ కమిటీ గురువారం ప్రపంచ కప్ టోర్నీకి 30 మంది సభ్యులతో కూడిన ప్రాబబుల్స్ జాబితాను ప్రకటించింది.
ఊహించినట్లుగానే సీనియర్లకు సెలక్టర్లు ప్రాబబుల్స్ జాబితాలో చోటివ్వలేదు. మహేంద్ర సింగ్ ధోనీ, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనాలకు చోటు దక్కింది.
వీరితోపాటు రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, వరుణ్ అరోన్, అశోక్ దిండా, మురళీ విజయ్, వృద్ధిమాన్ సాహా, సంజూ శామ్సన్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, కులకర్ణి, మనోజ్ తివారీ, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, పర్వేజ్ రసూల్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, స్టువర్ట్ బిన్నీ, మోహిత్ శర్మ, కులదీప్ యాదవ్, అమిత్ మిశ్రా, కరణ్ శర్మలకు చోటు దక్కింది.
అందరూ ఊహించిన విధంగానే యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేసిన సెలక్టర్లు, సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టారు. ప్రాబబుల్స్ జాబితాలో తమకు చోటు దక్కుతుందని భావించిన సీనియర్ ఆటగాళ్లకు ఈ జాబితా నిరాశే మిగిల్చింది.