సిడ్నీ: ఐసీసీ వరల్డ్ కప్లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో భారత్-ఆస్టేలియా మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ ఈరోజు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ వీక్షించేందుకు టాలీవుడ్ నటుడు వెంకటేష్ ఆస్టేలియా వెళ్ళారు.
హీరో వెంకటేష్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్తో కలిసి మ్యాచ్ని వీక్షిస్తున్నారని తెలుస్తోంది. హీరో వెంకటేష్ వెంట జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చాముండేశ్వరి నాథ్ కూడా ఉన్నారు. హీరో వెంకటేష్కు క్రికెట్ అంటే ఎంత ప్రేమో చెప్పాల్సిన పని లేదు.
టీమిండియాకు వీరాభిమాని అయిన వెంకటేష్ టీమిండియా ఆడే ప్రధాన మ్యాచ్లన్నీ ప్రత్యక్షంగానే వీక్షించడం గతంలో చూశాం. భారతీయ సినిమా పరిశ్రమకు చెందిన హీరోలంతా కలిసి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పేరిట ప్రతి ఏడాది క్రికెట్ ఆడుతుంటారు.
ఆ లీగ్లో హీరో వెంకటేష్ తెలుగు వారియర్స్ జట్టుకు కెప్టెన్గా కూడా వ్వవహరించారు. 2011లో స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లకు వెంకటేష్ హాజరైన విషయం తెలిసిందే.