హైదరాబాద్:సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్లో సాయి ప్రణీత్ సంచలనం సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్పై 17-21, 21-17, 21-12 తేడాతో ప్రణీత్ విజయం సాధించాడు. దీంతో తన కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు.
హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో కిదాంబి శ్రీకాంత్పై సాయి ప్రణీత్ పైచేయి సాధించాడు. తొలి గేమ్ను ప్రణీత్ కోల్పోయినా, వెంటనే పుంజుకుని రెండో గేమ్లో వరుస పాయింట్లు సాధించి విజయావకాశాలను కాపాడుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్ను కైవసం చేసుకుని విజేతగా నిలిచాడు.
మూడో గేమ్లో ప్రణీత్ మరింత విజృంభించాడు. క్రాస్కోర్టు, డ్రాప్షాట్లు, బేస్లైన్ నుంచి అద్భుత ఫ్లిక్లతో 21-17 మూడో గేమ్ సొంతం చేసుకున్నాడు. కిదాంబి శ్రీకాంత్పై తనదే మెరుగైన రికార్డు అని తాజా విజయంతో మరోసారి నిరూపించుకున్నాడు.