న్యూఢిల్లీ : ఓవైపు దేశ సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ పాక్ ఉగ్రవాదులను మట్టుబెడుతుంటే.. మరోవైపు మైదానంలో పాక్ జట్టును చిత్తు చేసింది ఇండియన్ అండర్-18 హాకి టీమ్. దాయాదుల మధ్య సరిహద్దు వాతారణం రణరంగాన్ని తలపిస్తుండడంతో.. మైదానంలో రెండు జట్ల పోరు మరింత ఉత్కంఠ రేకెత్తించింది.
కాగా, ఆసియా కప్ టోర్నమెంట్ లో భాగంగా.. గురువారం నాడు ఢాకా వేదికగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో 3-1తేడాతో పాక్ ను కంగు తినిపించింది ఇండియన్ హాకీ టీమ్. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే శివం ఆనంద్ గోల్ చేయడంతో జట్టుకు శుభారంభం లభించింది. ఆ తర్వాత దిల్ ప్రీత్ సింగ్ మరో గోల్ చేయడం.. మ్యాచ్ ద్వితీయార్థంలో సంజీప్ మూడో గోల్ సాధించడంతో ఇండియా మెరుగైన ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Kudos to young Kunwardilraj Singh for his 'Man of the Match' winning performance against Pakistan on 29 Sep 2016!#IndiaKaGame pic.twitter.com/j7VvkhtRNV
— Hockey India (@TheHockeyIndia) September 29, 2016
అయితే ఆఖర్లో పాక్ తరుపున అలీఖాన్ గోల్ చేయడంతో.. భారత్ అధిక్యం 3-1 కు తగ్గింది. ఏదేమైనా పాక్ పై భారత్ విజయం ప్రస్తుతం దేశాభిమానుల్లో ఆనందం నింపుతోంది.మరో మ్యాచ్ లో తైపీ పై 5-1తేడాతో బంగ్లా విజయం సాధించడంతో.. తదుపరి మ్యాచ్ లో ఇండియన్ హాకి టీమ్ బంగ్లాదేశ్ తో తలపడనుంది.