ముంబై: నగరంలోని వాంఖడే స్టేడియంలోకి బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్, ఆమె బృందాన్ని అధికారులు అనుమతించలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచులు జరుగుతున్నందున అధికారులు ఐశ్యర్య బృందానికి షూటింగ్ చేసుకునేందుకు అనుమతి నిరాకరించారు.
బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా దర్శకత్వంలో ఐశ్వర్య రాయ్ నటిస్తున్న 'జాజ్బా' షూటింగ్ చేసుకునేందుకు వారు వాంఖడే స్టేడియానికి వెళ్లారు. అయితే అధికారులు మాత్రం వారిని అనుమతించలేదు.
వాంఖడే స్టేడియంలో సినిమా షూటింగ్ చేసుకునేందుకు అనుమతి తీసుకున్నప్పటికీ స్టేడియం అధికారులు ఐపిఎల్ మ్యాచ్ ఉన్నందున షూటింగ్కు అనుమతించలేదు. దీంతో ఐశ్యర్య చిత్ర బృందం తమ సినిమా షూటింగ్ను రద్దు చేసుకుని వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది.
వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు మ్యాచు ఉన్నందునే సినిమా షూటింగ్కు అనుమతి లభించలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, గతంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్కు వాంఖడే స్టేడియంలోకి అనుమతి నిరాకరించబడింది. ఇందుకు 2012లో భద్రతా సిబ్బందితో షారుక్ స్పల్ప ఘర్షణకు దిగటమే కారణం.
కాగా, ఈ ఘటనకు సంబంధించి షారుక్ ఖాన్పై కేసు నమోదు చేయాలని పోలీసులకు చైల్డ్ కమిషన్ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. చిన్న పిల్లల ముందు ఎంసిఏ అధికారులపై షారుక్ అసభ్య పదజాలంతో దూషించాడని పేర్కొంది.