రాణించిన రాయుడు, గెలిచిన ముంబై
కెప్టెన్ జేపీ డుమిని (19 బంతుల్లో 28) కూడా ధాటిగా ఆడాడు. ఓపెనర్ మయాంక్ (0) డకౌటవగా, శ్రేయాస్ అయ్యర్ 19, జాదవ్ 16 పరుగులు చేశారు. సౌరభ్ (13), కల్టర్ నైల్ (3) నాటౌట్గా నిలిచారు.
రాణించిన రాయుడు, గెలిచిన ముంబై
ముంబై బౌలర్లలో స్టార్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ (2/11) ఢిల్లీ పరుగుల వేటను కట్టడి చేసినా, మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. మలింగ 2, సుచిత్, పాండ్య ఒక్కో వికెట్ కూల్చారు. హర్భజన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
రాణించిన రాయుడు, గెలిచిన ముంబై
రూ. 16 కోట్ల పారితోషికంతో అత్యంత ఖరీదైన ఆటగాడిగా లీగ్లో అడుగుపెట్టిన యువరాజ్ ఈ మ్యాచ్తో తన పాత్రకు న్యాయం చేశాడు. తన ట్రేడ్మార్క్ షాట్లతో అభిమానులను రంజింపజేయడంతో పాటు, పరుగులవరద పారించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును కట్టబెట్టాడు.
రాణించిన రాయుడు, గెలిచిన ముంబై
50 పరుగులకే 3 వికెట్లు (మయాంక్, అయ్యర్, డుమిని) కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులో అడుగుపెట్టిన యువరాజ్ తొలుత పరుగుల వేటను నెమ్మదిగానే కొనసాగించాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ చివరి రెండు బంతులను ఫోర్లుగా తరలించాడు. ఆ తర్వాత బౌండరీలకు ఎక్కువ సమయాన్ని తీసుకున్నాడు.
రాణించిన రాయుడు, గెలిచిన ముంబై
ఓ వికెట్ తీసుకొని కట్టడిగా బౌలింగ్ చేస్తున్న మలింగకు 17వ ఓవర్లో చుక్కలు చూపించాడు. హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాతి ఓవర్లోనే రెండు వరుస సిక్స్లు బాది అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ పూర్తి ఇన్నింగ్స్లో కేదార్ జాదవ్తో కలిసి నాలుగో వికెట్కు 28 పరుగులు, మాథ్యూస్తో కలిసి ఐదో వికెట్కు 24 పరుగులు, తివారీతో కలిసి ఆరో వికెట్కు 20 బంతుల్లోనే 41 పరుగులు రాబట్టాడు.