న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 9వ ఎడిషన్ ఏప్రిల్ 9 నుంచి మే 29, 2016 వరకు నిర్వహించనున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
రాజ్ కోట్, పూణే ఫ్రాంచైజీలలో ఆడనున్న ఆటగాళ్ల కోసం ఫిబ్రవరి 6న బెంగళూరులో వేలం పాట నిర్వహించనున్నామని పేర్కొంది. ఈ వేలంలో గతంలో సస్పెన్షన్కు గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు సంబంధించిన ఆటగాళ్లతో పాటు కొత్త ఆటగాళ్లు కూడా పాల్గొనే అవకాశం ఉంది.
పూణె ప్రాంఛైజీ తొలి ఆటగాడిని ఎంచుకునే అవకాశం దక్కించుకుందని ఆర్గనైజర్స్ తెలిపారు. భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన టోర్నమెంట్లో ఐపీఎల్ ఒకటిగా నిలిచింది. అయితే స్ఫాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో చెన్నై, రాజస్థాన్ జట్లను రెండేళ్ల పాటు నిషేధించారు.