మీరట్: రియో ఒలింపిక్స్లో దేశానికి కాంస్య పతకం తీసుకొచ్చిన రెజ్లర్ సాక్షి మాలిక్పై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. నదీమ్ నంబార్డర్ అనే వ్యక్తి సాక్షితో పాటు ఆమె మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు గాను అతడిపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సింధుపై ఫేస్బుక్లో ప్రముఖ దర్శకుడి వెకిలి రాతలు: మండిపడ్డ నెటిజన్లు
స్థానిక సోషల్ మీడియా గ్రూప్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేసి సైబర్ సెల్ దర్యాప్తు చేస్తోంది. కాగా నిందితుడు పరారీలో ఉన్నాడని అతడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నదీమ్ ఫేస్బుక్ ప్రొఫైల్లో తాను సమాజ్వాదీ పార్టీ కార్యకర్తనని పేర్కొనడం విశేషం.
అయితే నిందితుడు నదీమ్కి పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని జిల్లా యూనిట్ పార్టీ చీఫ్ జైవీర్ సింగ్ స్పష్టం చేశాడు. హర్యానాకు చెందిన సాక్షి మాలిక్ రియో ఒలింపిక్స్లో 58 కేజీల విభాగంలో భారత్ కు కాంస్య పతకం అందించిన సంగతి తెలిసిందే. రియో ఒలింపిక్స్లో భారత్కు రెండు పతకాలు లభించిన సంగతి తెలిసిందే.
రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాక్షి సింగ్ గెలవగా, రజత పతకాన్ని బ్యాడ్మింటన్ విభాగంలో పీసీ సింధులు గెలిచారు.